Telugu News Power

కొత్త పామాయిల్ మిల్లులతో నూనె దిగుబడి పెంచాలి. -ఎంపీ పురందరేశ్వరి.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఈ పంట సుమారు 2.49 లక్షల హెక్టార్ల సాగవుతుందని తెలిపారు. దాదాపు 1.97 లక్షల మంది రైతులకు జీవనాధారంగా ఉందన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ పంట దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా జాతీయ…

Read More

రోటరీ జిల్లా గవర్నర్ గా ముచ్చర్ల సంజయ్.

విజయవాడ/పాలకొల్లు: ప్రతిష్టాత్మకంగా జరిగిన రోటరీ జిల్లా గవర్నర్ కు జరిగిన ఎన్నికల్లో స్థానిక ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ సోమవారం రాత్రి ఎన్నికయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రెవిన్యూ జిల్లాలు ఒక రోటరీ జిల్లాగా పరిగణిస్తారు. ఈ రోటరీ జిల్లాలో 74 క్లబ్బులు ఉన్నట్టు సంజయ్ తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం సభ్యులందరి సమిష్టి విజయం గా అభివర్ణించారు….

Read More

మంత్రి నిమ్మల రామానాయుడు రూ 5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన .

భీమవరం : మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు రూ 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ 3 కోట్లతో…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు.

విజయవాడ: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ సృష్టించిన అరుదైన రికార్డ్ పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సోమవారం స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అపూర్వ ఘట్టం సందర్భంగా, అభినందనలు తెలిపారు. భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నేతగా మోదీ ఈ రికార్డు సృష్టించారు. మునుపటి సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సృష్టించిన 8,930 రోజుల రికార్డును అధిగమించి, మోదీ 8,931 రోజులపాటు దాటీ…

Read More

నర్సాపురం తాలూకా జేఏసీ ఏర్పాటు.

నర్సాపురం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురంలో ఏపీ జేఏసీ నరసాపురం తాలూకా నిర్మాణం సోమవారం జరిగింది. యలమంచిలి, మొగల్తూరు నరసాపురం టౌన్, నర్సాపురం రూరల్ మండలాలు ఈ తాలూకాలో ఉన్నాయి. నరసాపురం తాలూకా జేఏసీ జాయింట్ సెక్రటరీ గా యలమంచిలి మండలం మండలం, పంతం రామమూర్తి నాయుడు, ఈసీ మెంబర్లుగా దండు పద్మావతి, గుత్తిందీవి శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఎస్ విజయరామరాజు ప్రధాన కార్యదర్శి పి…

Read More

ఉక్కు పరిశ్రమతో లక్ష మందికి ఉద్యోగాలు.

అనకాపల్లి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం లో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇది చారిత్రాత్మక ఘట్టం. పారిశ్రామిక రంగంలో కీలక మైలురాయిగా నిలిచే మరో భారీ ప్రాజెక్ట్‌కు అనకాపల్లి వేదికైంది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణం. ప్రముఖ ఉక్కు సంస్థ అర్సలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా చేపడుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ దేశ…

Read More

కనకయలంక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనుల్లో కదలిక.

యలమంచిలి: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) తరచూ, వరదలు వల్ల ఇబ్బందులు పడుతున్న కనకాయలంక ప్రజలకు శాశ్వత విముక్తి కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సోమవారం, ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారని, పెదలంక సర్పంచ్ తాళ్ల నాగరాజు తెలిపారు.

Read More

ప్రజా ఫిర్యాదులపై నాణ్యమైన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు.

భీమవరం: మార్చి ,23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫిర్యాదు దారుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వయంగా స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీలపై క్షుణ్ణంగా పరిశీలనచేసి, నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు చేపట్టి గడువులోపే సమస్యలు పరిష్కరించాలని సూచనలు చేశారు. పీజీఆర్ఎస్‌లో…

Read More

పోరాట యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం, బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలగజేయటానికి పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కీర్తించారు. కూటమి ప్రభుత్వం వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తొలిసారి, పాలకొల్లు లో, సోమవారం జరిగిన జయంతి ఉత్సవాల్లో వెంకట రెడ్డికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమ కాలంలో, తన సొంత…

Read More

తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం పై నేడే జాతీయ సదస్సు.

పాలకొల్లు: మార్చి,23(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో నేడు, మంగళవారం జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సోమవారం తెలిపారు. తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం అనే అంశం మీద ఈ సదస్సు జరుగుతున్నట్టు వివరించారు. ప్రాచ్య పరిశోధన సంస్థ, చెన్నై,తెలుగు శాఖ అధిపతి, ఆచార్య విస్తాలి శంకర్రావు, ప్రారంభ సమావేశ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలుగు శాఖ, పూర్వ అధ్యక్షులు, ఆచార్య దార్ల…

Read More