Telugu News Power

డ్రైవింగ్ స్కూళ్ళతో కోటి ఉద్యోగాలు. -కేంద్రమంత్రి గడ్కరి

న్యూఢిల్లీ: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో ఏర్పాటు చేస్తున్న డ్రైవింగ్ స్కూల్ వల్ల కోటి ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరి వెల్లడించారు. దేశంలోని120 జిల్లాల్లో 500 బ్లాక్ లలో 620 డ్రైవింగ్ స్కూల్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు పూర్తయిందన్నారు.

Read More

ఏనుగువానిలంకలో పశువైద్య శిబిరం.

పాలకొల్లు: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర జలళనరుల శాఖామంత్రి, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు,ఏనుగు వాని లంక గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రైతులకు వారి పశువులకు సంబంధించిన మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, వైస్ చైర్మన్ దాసరి రత్నం రాజు, ఏఎంసి డైరెక్టర్ బిట్టా లక్ష్మీనారాయణ, ఏనుగువానిలంక సొసైటీ చైర్మన్…

Read More

బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం.

అమరావతి: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్.కాం) ఇటీవల జరిగిన బస్సు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద మృతులకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు، మీరు వేలు వైద్య సౌకర్యం అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 13 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టు తెలిపారు. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద ఘటనపై…

Read More

అమరావతి చట్టబద్ధతకు క్యాబినెట్ శ్రీకారం.

అమరావతి: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. హోం శాఖ:గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు ‘అకడమిక్ భవనాలు’ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడానికి…

Read More

వాకర్స్ క్లబ్ సహాయం.

పాలకొల్లు: మార్చి, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాకర్స్ క్లబ్, ఇద్దరు పేద విద్యార్థులకు బుధవారం, కొత్త కుళాయి చెరువు వద్ద, అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు సైకిళ్ళు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామరాజు లంక గ్రామం, ఉర్రింక మధు వర్షిని, నాగులంక గ్రామం, మండపాక సిద్దు దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లడానికి, 14 వేల రూపాయలతో ఈ సహాయం అందజేశారు. బట్టీలంక కు చెందిన ఇంటర్ విద్యార్థి బి.హాసినికి వైద్య…

Read More

పవన్ కళ్యాణ్ పై వేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, టిక్కెట్ ధర పెంపులో నిబంధనలు పాటించలేదని, మేరకు విచారం జరిపించాలని పిటిషనర్ విజయ్ కుమార్ కోర్టుకు వెళ్లారు. వీరి తరఫున న్యాయవాది బి.బాలయ్య వాదించారు. అడ్వకేట్ జనరల్…

Read More

ఉత్తర అమెరికాకు ప్రత్యేక ప్రతినిధిగా మిరియాల శ్రీనివాస్ నియామకం.

అమరావతి, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రతినిధ్యం వహించేందుకు శ్రీ మిరియాల శ్రీనివాస్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి నంబర్ 632 ప్రకారం, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

Read More

వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం వెలివెల, ఆరట్లకట్ట గ్రామాల్లో ఆత్మ వారి సహకారం తో మంగళవారం రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. అగర్తి పాలెం లో వరి పాలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మారుటేరు శాస్త్ర వేత్తలు డాక్టర్ మల్లి కార్జునరావు మాట్లాడుతు వరి పంట పాలు పోసుకొనే దశ లో ఉన్నది ఉక్కబోత గా ఉంటుంది, కావున దోమ వచ్చే సూచన ఉంది, కాబట్టి రైతులు జాగ్రత్తగా పొలం…

Read More

యుటిఎఫ్ నిరాహార దీక్ష

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ రణభేరి 3. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, ఐ ఆర్ 29% ప్రకటించుట, డి ఎ బకాయిలు చెల్లించుట, 2004 కు ముందు నియమించబడిన ఉద్యోగులకు ఓ పి ఎస్అమలు చేయాలనే అంశాలపై రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు నియోజక పరిధిలో పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరం లో ఉదయం 10 గంటలునుండి 3 గంటల వరకు 70 మంది…

Read More

దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన,దళిత క్రైస్తవుల రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కూడా…

Read More