Skip to main content

Telugu News Power

ముద్రగడ కుమార్తె క్రాంతిపై మండిపడ్డ పద్మనాభరెడ్డి.

హైదరాబాద్:జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తన కుమార్తె భార్లపూడి క్రాంతిపై మండిపడ్డారు. గతంలో తన సతీమణి క్యాన్సర్ చికిత్స అనంతరం విశ్రాంతి కోసం హైదరాబాద్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లిన సందర్భంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆయన ఆరోపించారు. కుటుంబ విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ముందుకు తీసుకురావడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు . ప్రస్తుతం తమ కుటుంబాన్ని అన్ని విధాలా…

Read More

జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ పరిశీలకుల నియామకం.

మంగళగిరి: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి ‘సమాచార సేకరణ కమిటీ’లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని…

Read More

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుఖశాంతులు. ఓర్వలేని వైసిపి పార్టీ -కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి

నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. కొత్తపల్లి సోమవారం నరసాపురం వారి స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సంతోషం చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ సమస్యలు సృష్టించటానికి అవాకులు చవాకులు మాట్లాడటం మంచిది కాదని హేతువు పలికారు. అంబేద్కర్ కాల్షియం జిల్లాకు చెందిన వైసీపీ…

Read More

కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం. -నమ్మకం సభలో మంత్రుల మాట

పాలకొల్లు: జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుందని స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుష్కర కాల పాలన, ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా గురువారం, స్థానిక…

Read More

జనసేన ప్రస్థానం – దేశసమైక్యత కోసం.

ఢిల్లీ సమావేశంలో అయిదు తీర్మానాలకు ఆమోదం. న్యూఢిల్లీ, జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశం అయిదు తీర్మానాలను ఆమోదించింది. వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు అనే తీర్మానాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ…

Read More

వాస్తవ ఓటర్లను గుర్తించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ.

పాలకొల్లు: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో వాస్తవ ఓటర్లను గుర్తించాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎస్ ఐ ఆర్ పై బిజెపి శ్రేణులకు ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల సవరణ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం…

Read More

రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధిస్తున్నారు. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు ఆరోపణ.

పాలకొల్లు: జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాజకీయంగా ఎదుర్కోలేక, తన వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాల పై గత పది రోజులుగా చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, రాజకీయ కక్ష సాధింపులను జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, వైసిపి సీనియర్ నాయకులు మేకా శేషుబాబు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. తనను, మహిళలను కూడా చూడకుండా తన కుటుంబ సభ్యులను అవమాన పరచాలని, ఇబ్బంది పెట్టాలని ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు….

Read More

మంచినీటి సమస్యకు మూలం వైసీపీ నిర్లక్ష్యం. -మంత్రి నిమ్మల మరోసారి ఆరోపణ.

పాలకొల్లు: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణ ప్రజల మంచినీటి కొరతకు మూలం, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంత్రి మంగళవారం అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తాము ప్రతిపాదించిన విజ్జేశ్వరం నుంచి నేరుగా…

Read More

లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్.

అమరావతి: జూన్,9(తెలుగు న్యూస్ పవర్.కామ్)రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ శనివారం దాఖలు చేశారు. రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో, రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. లింగమనేని రమేష్…

Read More

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌తిరస్కరణ

భోపాల్: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్.కామ్) మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్, నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మంగళవారం తిరస్కరించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఒక న్యాయ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదనే అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు…

Read More