Skip to main content

Telugu News Power

“వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ నిరసన కార్యక్రమం.

యలమంచిలి: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది. గడిచిన రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా,ప్రజలను వంచించి నందుకు గాను వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి, ఈ నెల 12 వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈనెల 12న రాష్ట్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…

Read More

రైతన్నగా మంత్రి రామన్న

పాలకొల్లు: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా కీర్తించబడే రైతు గా వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటం తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారిక విధులకు ఆదివారం విరామం కావడంతో, ఉదయాన్నే సైకిల్ పై బయలుదేరి తన స్వగ్రామం లో ఉన్న వ్యవసాయ, ఆక్వాక్షేత్రాలను మంత్రి పరిశీలించారు. రొయ్యల చెరువు వద్ద వాటి ఆరోగ్య పరిస్థితిని, పెరుగుదలను పరిశీలించారు….

Read More

పసుపు ప్రభంజనంతో అంగరంగ వైభవంగా టిడిపి మహానాడు పండుగ.

జనరల్ డెస్క్: మే, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రాజకీయ చరిత్రలో, పార్టీ ఆవిర్భవించిన, కేవలం 9 నెలల కాలంలో అధికార పీఠంపై నిలబెట్టిన, సంచలన నాయకుడు, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే రెండు రూపాయల బియ్యం పథకం వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జననోత్సవం మే, 28 పురస్కరించుకొని ఏటా జరుపుకునే మహానాడు పండగ బుధవారం అంగరంగ వైభవంగా…

Read More

మహానాడు పసుపు పండుగగా విజయవంతం చేయాలి. -టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మంత్రి నిమ్మల పిలుపు.

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్). సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగల్లా టిడిపి ఆవిర్భావ దినోత్సవం మహానాడు పసుపు పండుగ ఘనంగా నిర్వహించాలని, టిడిపి శ్రేణులకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే,మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పిలుపునిచ్చారు. టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి, యువగళం నేత నారా లోకేష్ బాబు మంత్రి నిమ్మల మహానాడు జరిగే ప్రదేశాలను సర్వాంగ సుందరంగా పసుపుమయంగా తీర్చిదిద్దారు. ఈనెల 27,…

Read More

జనసేన రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

మంగళగిరి: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాష్ట్ర కమిటీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయన నివేదిక పార్టీ అధిష్టానానికి అందించవలసి ఉంది. ఈ కమిటీలో, కొణతాల రామకృష్ణ, (అనకాపల్లి), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి),ఆరని శ్రీనివాసులు (తిరుపతి) పంతం నానాజీ (కాకినాడ గ్రామీణ), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) సామినేని ఉదయభాను, (ఎన్టీఆర్ జిల్లా)…

Read More

అధికార మార్పిడితో మారిన భారత రాజకీయ ముఖచిత్రం.

జనరల్ డెస్క్: ఏప్రిల్,4(తెలుగు న్యూస్ పవర్. కాం) ఈ ఏడాది, ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల చారిత్రాత్మక ఫలితాలు భారతదేశ రాజకీయ భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరింపచేసాయి. బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది, తమిళనాడులో టీవీకే షాక్ ఇచ్చింది, కేరళలో ఎర్రజెండా అధికారం పోగొట్టుకొని, దేశంలో కమ్యూనిస్టులకు ఉన్న ఒకే ఒక్క అధికార పీఠం 50 ఏళ్ల తరువాత కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారం చేపట్టి, తన ఉనికిని కాపాడుకుంది. పుదుచ్చేరి ఎన్నికల్లో మళ్లీ అధికారం…

Read More

బిజెపి విజయోత్సవం.

యలమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)దేశంలో మినీ ఎన్నికలుగా భావించిన, ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ, మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించటంతో యలమంచిలి మండల భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మేడపాడు సెంటర్లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లభు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి నంబూరి రంగారావు, జడ్డు రామకృష్ణ కుక్కల కేశవరావు, దివి నరసింహారావు, పోతు మహేష్, పతంజలి,,వీర…

Read More

కష్టపడి పనిచేసే వారికి ఓటెయ్యండి, వైసీపీకి ఒక్క ఓటు వేసిన నష్టమే

యలమంచిలి: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేసే కూటమి ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఓటు వేయాలని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఆరు గ్రామాలలో, రూ. 7.60 కోట్ల తో ప్రారంభించనున్న, 10 పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులతో, 20 ఏళ్ళ వెనక్కు…

Read More

ఎగ్జిట్ పోల్స్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బుధవారం ముగిసాయి. ఈ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు తమఅంచనాలు ఋధవారం ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఇది కేవలం అంచనాలు మాత్రమే.

Read More

ఇంధన కొరత తీర్చకపోతే ఉద్యమిస్తాం. వైయస్సార్ సిపి ఇంచార్జ్ గుడాల గోపి.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో 9నెలలకు సరిపడ ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎందుకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు, భీమవరం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గుడాల గోపి ఇంధన సరఫరా ఇబ్బందులపై మాట్లాడారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే ప్రసాద రాజు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, మంత్రులు బ్లాక్ మార్కెట్…

Read More