బాధితులకు అండగా ఉంటాం -ఎమ్మెల్యే అంజిబాబు.
భీమవరం : మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన 12 మంది శ్రామికులు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని, బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) భరోసా ఇచ్చారు.. భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అంజిబాబు గురువారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం…