Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో స్వచ్ఛంద కార్యక్రమం.

పాలకొల్లు: మే 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రా” సాధనే ముఖ్య అజెండాగా ఎన్.ఎస్.ఎస్ I, II యూనిట్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం, మూగజీవాల ప్రాణాలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చండి హోమం.

భీమవరం: మే, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా శనివారం ఆలయ అర్చకులు మరియు వేదపండితులు చండీహోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 92 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

భీమవరం: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం తో…

Read More

కేంద్ర మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ దగ్గుబాటి. పురందేశ్వరి.

లోక్‌సభ స్పీకర్ మహిళా సాధికారత కమిటీ (2026-27)ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు డాక్టర్ డి. పురందేశ్వరి నియమితులయ్యారు. లోక్‌సభ సభ్యులు (18 మంది): డాక్టర్ డి. పురందేశ్వరి, స్మత్. లవ్లీ ఆనంద్, స్మత్. డి.కె. అరుణ, స్మత్. హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మత్. శోభనాబెన్ మహేంద్రసింహ్ బరాయియా, మిస్. ఇక్రా చౌదరి, స్మత్. కృతి దేవి డెబ్బర్మన్, కుమారి ప్రియాంక సతీష్ జార్కిహోలి, డాక్టర్ కాడియమ్…

Read More

కోనసీమ తిరుమలకు కోటి నిధులు.

ఆత్రేయపురం: మే,15(తెలుగు న్యూస్ పవర్.కామ్) కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. రుడా ఈ నిధులు సమకూర్చింది. నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలం నుంచి స్వామివారి ఆలయం వరకు తారు రోడ్డు వేస్తారు. కాంక్రీట్ బేస్ నిర్మాణం, ఆలయం నుంచి ఏటిగట్టు వరకు తారు రోడ్డు వేయటానికి ప్రతిపాదించారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు…

Read More

ప్రఖ్యాత రచయిత్రి శారద ఆసుపవర్ధన్ ఇక లేరు.

సికింద్రాబాద్: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రఖ్యాత రచయిత్రి, ప్రసిద్ధ కవయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శారదా అశోకవర్ధన్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శారదా అశోకవర్ధన్ 28 జూలై 1938 న సికింద్రాబాద్‌లో జన్మించారు. తన 87ఏళ్ల ప్రస్థానంలో సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ కలిపి 82 గ్రంథాలు వెలువరించారు. శారద అశోకవర్ధన్ ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్ గా జవహర్ బాల భవన్ సంచాలకులుగా ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఉద్యోగం చేశారు సెంట్రల్…

Read More

పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక అధికారిని కలిసిన ఎమ్మెల్యే నాయకర్.

అమరావతి: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ఏర్పాట్ల గురించి నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గుమ్మడి నాయకర్ శుక్రవారం అమరావతి సచివాలయంలో పుష్కరాల ప్రత్యేక అధికారి ఐఏఎస్ జి. వీరపాండియన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు అంశాలపై వీరిరువురు విస్తృతంగా చర్చించారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో, వారికి మెరుగైన సౌకర్యాలు అందించేలా ఘాట్ల అభివృద్ధి, రహదారుల…

Read More

జిఎస్టి భారీ కుంభకోణం రూ.17 వందల కోట్లు.

విశాఖపట్నం: మే, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశాఖ జీఎస్టీ నిఘావిభాగం భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు 17వందల కోట్ల రూపాయల భారీ నకిలీ ఇన్ వాయిస్ ల కుంభకోణాన్ని విశాఖ జిఎస్టి నిఘా విభాగం అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ కేసు సంబంధించి ప్రధాన కుట్రధదారు ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజిరెడ్డి)ని డి జి జి ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మోసంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడినట్లు…

Read More

ఉద్యోగం పోగొట్టుకున్న పద్మ జైస్వాల్, ఐఏఎస్.

న్యూఢిల్లీ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాల్) ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్ సేవల నుంచి తొలగించారు. అత్యంత పిన్నవయస్కురాలుగా ఐఏఎస్ లో గుర్తింపు పొందారు. ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేంద్రం కఠిన చర్య పద్మ జైస్వాల్ అనే ఐఏఎస్ అధికారిణిని కేంద్ర ప్రభుత్వం సేవల నుంచి తొలగించింది. 2003 బ్యాచ్‌కు చెందిన ఆమె, అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు…

Read More

నిందితుడికి ఉరిశిక్ష వేయించిన పోలీసు బృందానికి సత్కారం.

హైదరాబాద్: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్)సనత్‌నగర్‌ బాలుడి దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పోలీస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు.ఈ శిక్ష ఖరారులో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తు యాదవ్, సనత్ నగర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శేఖర్‌లను అభినందించారు.నేరస్థులు ఎంతటి వారైనా చట్టం…

Read More