తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. -పార్టీజాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అమరావతి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ,సుశిక్షితితులైన కార్యకర్తలదేనని, వారే అధినేతలని, రాజకీయాల్లో కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ పదాన్ని ఆవిష్కరించి ఆదివారం ఆవిర్భవ సభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని మూడు ముక్కలాట ముగిసింది…