Skip to main content

Telugu News Power

హరేంధిర ప్రసాద్ కాకినాడ కొత్త కలెక్టర్.

కాకినాడ: ఏప్రిల్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) హరేంధిర ప్రసాద్ కాకినాడ కొత్త కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ఆర్డీవో ఎస్ మల్లిబాబు, కమిషనర్ సత్యనారాయణ, డిఆర్ఓ తిప్పే నాయక్ తదితర అధికారులు కొత్త కలెక్టర్ కు స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా పరిస్థితులపై తనకు అవగాహన ఉందని, పూర్తి ప్రభుత్వ సమాచారం సేకరించి ముందుకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల సహాయసహకారాలతో కాకినాడను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో…

Read More

ఫిషింగ్ హార్బర్ కు రూ.72.42 కోట్లు మంజూరు.

కాకినాడ: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తున్నట్టు స్థానిక ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. మత్స్యకార సోదరుల అభ్యున్నతికి సంబంధించి నిధుల కోసం, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, తరచూ సంబంధిత శాఖ అధికారులతో చర్చలు జరిపానన్నారు. ఫలితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు కేంద్రం రూ.72.42 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మత్స్యకార సోదరసోదరీమణుల ఉన్నతికి ఈ నిధులు…

Read More

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాత పాలనాదక్షుడిగా కీర్తించబడిన, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ పాలన యంత్రాంగం పట్టు తప్పిందని, తన మాట చెల్లుబాటు కావటం లేదని, ఓ సందర్భంలో, ముఖ్యమంత్రేం స్వయంగా వాపోయారు. గతంలో ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో, ప్రజల ముందు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన సందర్భంగా ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇది మంచి…

Read More

నేను రాను నరసాపురానికి, అరుణాచలానికి ఆగిన రైలు కూత.

విజయవాడ:మార్భి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక వూడిన చందంగా తయారయింది అరుణాచలం రైలు ప్రయాణం. గత కొంతకాలంగా భక్తులు విశేషంగా దర్శిస్తున్న, అరుణాచలం యాత్రకు పచ్చ సిగ్నల్ లేక ఆగిపోయింది. నరసాపురం నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణం తిరువణ్నమలై వరకు సాగుతుంది. భక్తులకు ఈ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల, పలు జిల్లాల భక్తులు రిజర్వేషన్ కోసం పోటీ పడుతున్నారు. ఏడాదిన్నరగా, రెండు నెలలకు ఒకసారి రైల్వే అధికారులు…

Read More

అంగన్వాడీలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వాలి. -సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త డిమాండ్.

జనరల్ డెస్క్: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్.కామ్) మే నెలలో ఎండల తీవ్రత వల్ల అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించారు. ప్రీస్కూల్ పిల్లలను సెంటర్‌కు పంపించడానికి తల్లిదండ్రులు చెందుతున్నారన్నారు. ప్రీస్కూల్ పిల్లలు ఎండల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురవుతారని భయం వ్యక్తం చేస్తున్నారన్నారు.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా సెంటర్‌కు రాలేకపోతున్నారు. ఆ సమయంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి…

Read More

జిల్లా అభివృధ్ధే ధ్యేయంగా సమగ్ర ప్రణాళిక. -బడ్జెట్ అవుట్ రీచ్ పై సమీక్ష

భీమవరం:మార్చి,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన “బడ్జెట్ ఔట్‌రీచ్” సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం నిర్వహించారు. వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాలకు విస్తరించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. “స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్య సాధనలో భాగంగా తలసరి ఆదాయం పెంపు, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అధికారులు ముందస్తు ప్రణాళికలతో బడ్జెట్…

Read More

క్షీరారామంలో నృత్య ప్రదర్శనలు.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రంలో కళ్యాణోత్సవాల్లో భాగంగా, భక్తుల కోసం నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన తిలకించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాస్ నృత్యకళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కళ్యాణోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకులు…

Read More

వాకర్స్ క్లబ్ ఉచిత మందుల పంపిణీ.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అనారోగ్యంతో బాధపడుతున్న, స్థానిక, రావూరి శ్రీనివాస్, పెదమామిడిపల్లికి చెందిన, గూడపాటి అనంతలక్ష్మి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, బట్టే లంక, తోలేటి రామాంజనేయుల కు 20 వేల రూపాయల విలువైన మందులు మంగళవారం క్లబ్ తరఫున తటవర్తి సుధాకర్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ పీర్ సాహెబ్, కటారి నాగేంద్ర కుమార్, ధనాని శ్రీరామూర్తి, పోతుల ఉమామహేశ్వరరావు, సలాది రామ చంద్ర రావు, బసవరాజు, శ్రీనివాస రావు తదితరులు…

Read More

మాల మహానాడు అధ్యక్షులు రాజేష్ గృహ నిర్బధం.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నల్లి రాజేష్ ను పాలకొల్లు పోలీసులు మంగళవారం గృహ నిర్బంధంలో ఉంచారు. ఇటీవల ఆకివీడు మండలం పేదపేట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రవేశించడానికి వెళ్లిన సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భీమవరంలో జరపతల పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షులు నల్లి రాజేష్ వారి అనుయాయులు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి స్థలానికి…

Read More

దేశంలోనే ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ -ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షతకు నిదర్శనం.

న్యూఢిల్లీ/విజయవాడ:మార్చి, 31 (తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కృషితో పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో 5 అవార్డులు దక్కించుకున్నాయి. గతంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మెరుగైన పనితీరుతో 1వ స్థానానికి పంచాయతీరాజ్ శాఖ చేరుకోవడం ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దక్షతకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్…

Read More