Telugu News Power

Telugu News Power

నేడు, రేపు రైల్వే గేట్ మూసివేత.

పాలకొల్లు: మే, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు-భీమవరం రోడ్డులో ఉన్న రైల్వే గేట్ ఈనెల 21, 22 న రెండు రోజులపాటు రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నిమిత్తం మూసివేస్తారని రైల్వే శాఖ తెలిపింది. ఇందువల్ల భీమవరం-పాలకొల్లు మధ్య ప్రయాణించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లవలసిందిగా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వే గేటు శుక్రవారం ఉదయం 7 గంటలకు మూసివేసి, శనివారం రాత్రి 7 గంటలకు తెరుస్తారని రైల్వేశాఖ వివరించింది.

Read More

నాటి విధ్వంస పాలన, నేటి అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలు బేరిజు వేసుకోవాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆనాడు ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసపాలన ప్రారంభమైందని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. మండలంలోని వరిధనం, దిగమర్రు, పెదమామిడిపల్లి, కొత్తపేట, పాలకొల్లు రూరల్ లో రూ. 1.90 కోట్లతో ప్రారంభించబోయే అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవపరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వరిధనంలో ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ఎక్కిన కొమ్మనే నరుక్కున్నట్టు, కలెక్టర్ల మీటింగ్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి స్వర్ణ ప్రాజెక్ట్ కు కమిటీ ఏర్పాటు.

భీమవరం: మే,20(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయనిధికి కమిటీ ఏర్పాటు చేశారు. నీ మ్యారేజ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో 12 మంది సభ్యులు,3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ కమిటీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ మయ నిధికి 27 కిలోల బంగారం సహకరించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇప్పటికే 51కేజీల బంగారం వివిధ ఆభరణాల రూపంలో ఉంది. స్వర్ణమయ నిధికి 23 కేజీల బంగారం భక్తులు…

Read More

పట్టణంలో మందుల షాపుల బంధు విజయవంతం.

పాలకొల్లు: మే, 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సంప్రదాయ మెడికల్ షాపుల ఉనికిని దెబ్బతీస్తున్న ఆన్లైన్ ఔషధ విక్రయాల పట్ల దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ కార్యక్రమం బుధవారం పాలకొల్లులో విజయవంతం అయ్యింది. మందుల షాపుల యజమానులు, ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కార్పొరేట్ రంగం అనైతిక వ్యాపార చర్యలతో మందుల షాపులపై ఆధారపడి జీవిస్తున్న వారి పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ డిస్కౌంట్ ల ద్వారా సాంప్రదాయ ఔషధ…

Read More

చించినాడలో ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: మే,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోనే తొలిసారి వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు బుధవారం చించినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ విడత ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు 109 (8,9,10 తరగతుల) మందికి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు. శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ వారి సి ఎస్ ఆర్…

Read More

పట్టణ మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో వైసిపి నిరసన.

పాలకొల్లు: మే,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో మంచినీటి సరఫరా ఇబ్బందులపై వైసీపీ నాయకులు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వంటి పూట సరఫరా చేస్తున్న మంచినీరు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇందువల్ల మహిళలు నానా అవసాట్లు పడవలసి వస్తుందని, కమిషనర్ పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు. మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నేలపై కూర్చుని తమ నిరసన…

Read More

కూటమి ప్రభుత్వంలో 27 వేల కిలోమీటర్ల రహదారులకు మోక్షం. -ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

పాలకొల్లు: మే 19, (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 27 వేల కిలోమీటర్ల రోడ్లు వేసినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్థానిక నియోజకవర్గ పరిధిలో రూ.12.90 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు అనిత శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జనార్ధన రెడ్డి, మాట్లాడుతూ, జిల్లాకు రోడ్ల అభివృద్ధి…

Read More

జర్నలిస్టులకు అండగా ఉంటా. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు:,మే,18 తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని, స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరి ఆరోగ్య భీమాకు సంబంధించి రూ.1250 లు 26 నంది అర్హులైన జర్నలిస్టులకు మంత్రి సోమవారం సొమ్ము చెల్లించారు. జీత భత్యాలు లేని, సేవా భావంతో పనిచేసే జర్నలిస్టులు తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్ట్ సోదరుల సమస్యలు,…

Read More

సీనియర్ సిటిజన్స్ నూతన కమిటీ ఎంపిక.

పాలకొల్లు, మే, 1 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సీనియర్ సిటిజన్స్ సంఘం కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. స్థానిక సంఘ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా వంగా నరసింహారావు, అధ్యక్షులుగా యర్రంశెట్టి వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా అడ్డాల వాసుదేవరావు, కలిదిండి నరసింహారాజు, వెంకటపతి వర్మ, కొల్లి నరసింహ మూర్తి, కార్యదర్శులుగా రాయి సూరిబాబు, పెనుగొండ సూర్యనారాయణ, కంచి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా, మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దాట్ల రామకృష్ణారాజు, , కోశాధికారిగా, డాక్టర్ పేరిచెర్ల ప్రతాప్…

Read More

నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. మంత్రి నిమ్మల.

ఫోడూరు: మే, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముమ్మారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక జిన్నూరు లో అభివృద్ధి పనులకు రూ.2.49 కోట్లు, వేడంగిలో రూ.43.70 లక్షలు మట్టపర్రు అభివృద్ధి పనులకు రూ. 83 లక్షలు మొత్తం రూ .3.76 కోట్ల తో 15 అభివృద్ధి పలుకు రామానాయుడు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. మట్టపర్రులో ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ…

Read More