Telugu News Power

Telugu News Power

కలెక్టరేట్‌లో సామాన్యులకు లిఫ్ట్ సౌకర్యం.

భీమవరం: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్.కామ్) సామాన్యుల కోసం కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి అర్జీల సమర్పణకు, ముఖ్యంగా సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు కలెక్టరేట్‌కు వస్తున్నారని తెలిపారు.పై అంతస్తులకు చేరుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.10 లక్షల వ్యయంతో లిఫ్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైన వారు…

Read More

పాలకొల్లు రూరల్ పంచాయతీని గాలికి వదిలేసిన వైసిపి ప్రభుత్వం – మంత్రి నిమ్మల విమర్శ.

పాలకొల్లు: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, పాలకొల్లులో రూరల్ పంచాయతీని గాలికి వదిలేసిందని మంత్రి, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. అటు పంచాయతీకి,ఇటు మున్సిపాలిటీకి చెందకుండా అభివృద్ధిలో వెనుకబడిపోతున్న, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం,ఉపముఖ్యమంత్రి,,పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కలెక్టర్ తదితర అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే శంకుస్థాపన సభలో వెల్లడించారు. పని చేయని…

Read More

తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రారంభం.

తిరుమల: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్) చంద్రగ్రహణం సందర్భంగా, మంగళవారం ఆలయాలు మూసి ఉంచారు. గ్రహణం విడిచిన తరువాత, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే నిమిత్తం, శాస్త్రోక్తంగా ఆలయ సంప్రోక్షణ చేశారు. గ్రహణ శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అధికారులు అనువమతించారు.

Read More

అల్లు వారి ఇంట పెళ్ళంట, భారీగా ఫ్రీ వెడ్డింగ్ షూట్.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. పాలకొల్లు ముద్దుబిడ్డ, విఖ్యాత హాస్యనటులు, అల్లు రామలింగయ్య, మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, పాన్ ఇండియా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, మెగా మేనల్లుడు అల్లు శిరీష్ వివాహం ఈనెల 6న జరగనుంది. వివాహ వేడుకల్లో భాగంగా, మంగళవారం ఫ్రివెడ్డింగ్ షూట్ జరిగింది. కాబోయే దంపతులు, నయనిక రెడ్డి, అల్లు శిరీష్ ఈ వేడుకకు ప్రత్యేక…

Read More

కేరళలో బిజెపి గెలుపు తథ్యం. -కేంద్రమంత్రి వర్మ ఆశాభావం

కోచి: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ మంగళవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి కేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, జి జి జోసెఫ్, కార్యదర్శి రేణు సురేష్, జోనల్ ఉపాధ్యక్షులు ఎం ఎన్ గోపి, ఎర్నాకులం అధ్యక్షులు, ఎం ఏ బ్రహ్మ రాజ్, తదితర బిజెపి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో…

Read More

విద్యార్థులకు విజయ్,రష్మికల పెళ్ళికానుక.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) ఇటీవల ఓ ఇంటి వారైనా సినీ నటుల జంట, విజయ్ దేవరకొండ, రష్మిక మదన్న ల వివాహ వేడుకల సంబరం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి స్వగ్రామం తెలంగాణలో ని నాగర్ కర్నూల్ జిల్లా, తుమ్మన్ పేటకు, నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్ళి కానుకగా, 9,10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేస్తామని ప్రకటించారు….

Read More

సితార డిజైనర్ చీర లక్ష

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్.కామ్) సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రతల, గారాల పట్టి సితార ఘట్టమనేని ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఆమె ధరించిన ఓ డిజైనర్ చీర. చీర ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిల్యాన్ని ఈ చీర రూప శిల్పి.

Read More

100 కోట్ల ప్రాజెక్ట్ కు అధిపతి, అప్పటికి వయసు పదహారే

ఫ్లోరిడా: మార్చి, 3 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫ్లోరిడాలో పెరిగిన భారతీయ యువతి ప్రంజలి అవస్థి16 ఏళ్ల వయసులో,స్టార్టప్ డెల్వ్.ఏఐ స్థాపించి రూ.100 కోట్ల విలువైన విజయం సాధించిన ప్రేరణాత్మక గాథ!భారత్‌లో జన్మించి 11 ఏళ్ల వయసులో అమెరికా ఫ్లోరిడాకు తరలి వచ్చిన 16 ఏళ్ల ప్రంజలి అవస్థి, ఇంకా హైస్కూల్ పూర్తి చేయకముందే 2022 జనవరిలో డెల్వ్.ఏఐ(డిఇల్ వి.ఏఐ) అనే ఏఐ-ఆధారిత పరిశోధన వేదిక స్థాపించింది. ఈ వేదిక పరిశోధకులకు విద్యా సంబంధమైన విషయాన్ని(అకడమిక్…

Read More

మంత్రి నిమ్మలచే 4.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పాలకొల్లు; మార్చి,2(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 6 శంకుస్థాపనలు చేశారు. స్థానిక ఏఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలకు 23 లక్షలు, కులాయి చెరువు గట్టు అభివృద్ధి సుందరీకరణకు, 2 కోట్ల రూపాయలు, మూడో వార్డు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు, సమత మహిళా మండలి భవన నిర్మాణానికి 29వ వార్డులో 40…

Read More

కొత్త రైల్వే జోన్ కు ఆర్థిక సలహాదారు నియామకం.

విశాఖపట్టణం: మార్చి, 2(తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నం కేంద్రంగా, కొత్తగా ఏర్పాటు అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సోమవారం డాక్టర్ పూడి హరి ప్రసాద్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ షియల్ అడ్వైజర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరి స్వస్థానం ఉత్తరాంధ్రకు చెందిన ఉద్దానం గ్రామం. వీరు 1993 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందినవారు. రైల్వే శాఖలో ఏదో హోదాల్లో పని చేశారు, రక్షణ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించారు. కొత్త రైల్వే…

Read More