చెరువు భూమిలో అక్రమ ఇళ్ల తొలగింపు . అర్హులకు ప్రభుత్వ ఇళ్ళు -కలెక్టర్ భరోసా.
వీరవాసరం: మే ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మత్స్యపురి గ్రామం చెరువు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల తొలగింపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి బాధితులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. తొలగించిన ఇళ్లలో అర్హత కలిగిన 16 మందిని గుర్తించి, వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రుణాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. డ్వాక్రా…