ఈనెల 22న ఆక్వా రైతుల ఉద్యమ శంఖారావం.
పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. స్థానిక పూలపల్లి కళ్యాణ మండపంలో గురువారం, సంఘ సమావేశం గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈనెల 22న ఉభయగోదావరులు, కృష్ణాజిల్లా ఆక్వా రైతులతో భారీ సభ జరపనున్నట్లు వెల్లడించారు. కొన్నిసార్లు తమ సమస్యలు తీసుకువచ్చినప్పటికీ, పరిష్కారం కాలేదు అన్నారు. యుద్ధం ముసుగులో కేజీకి 50 రూపాయల ధర తగ్గించడం, మేత ధర కేజీకి నాలుగు రూపాయలు…