Skip to main content

Telugu News Power

పాలకొల్లు లో మేత ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ కి రొయ్యల రైతుల సన్నాహాలు.

పాలకొల్లు: జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా రొయ్యల దాణ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు సహకరించవలసిందిగా అధికారులకు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గాంధీ భగవాన్ రోజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పలుపరిష్కారాల గురించి సమావేశంలో చర్చించారు. రొయ్యల…

Read More

ఈ నెల 30న రొయ్యల మేత షాపుల బంద్. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు.

పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా రొయ్యల మేత తయారీ ఫ్యాక్టరీలు భారీగా పెంచిన ధరలు తగ్గించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శుక్రవారం జరిగిన సమావేశంలో తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 30న మేత దుకాణాలన్నీ బంధు పాటించాలని పిలుపునిచ్చారు. ఆక్వా రైతులకు మద్దతుగా మేత షాపుల నిర్వాహకులు…

Read More

ఆక్వా రైతుల ఆక్రందన, వినతిపత్రాలల్లో తాసిల్దార్లకు విన్నపం.

పాలకొల్లు: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫీడ్ ధరల పెంపు పై ఆగ్రహించిన ఆక్వా రైతులు తమ ఉద్యమ ప్రారంభ ఘట్టంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని తహసిల్దార్ కార్యాలయాలతో వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రొయ్యలు రైతులు వెంటనే ఫీడ్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు…

Read More

రొయ్యల ఫీడ్ ధర పెంపుకు వ్యతిరేకంగా రెవెన్యూ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలి.

-రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: జూన్ 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో ఆక్వా రైతులు రొయ్యల దాణా ధర పెంపుకు నిరసనగా, శాంతియుతంగా వినతి పత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయాల్లో, ఆర్డిఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రైతులు వినతి పత్రాలు అందించాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో రైతులు…

Read More

రొయ్యలు చేపల కూరతో అన్నదానం చేసి, మృగశిర కు ఆహ్వానం పలికిన ఆక్వా రైతు సంఘం.

పాలకొల్లు: జూన్,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం,మార్టేరు కూడలి ప్రాంతాల్లో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రొయ్యలు చేపల కూరతో అలగాలని చేసి మృగశిర కార్తికి ఆహ్వానం పలికారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు ఆనందంగా విందు ఆరగించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, దేశంలోనే ఈ తరహా వినూతన కార్యక్రమం మొట్టమొదటిసారి ప్రారంభించినట్టు తెలిపారు….

Read More

సార్వాసాగుకు రైతులు సిద్ధపడాలి. -వ్యవసాయ అధికారుల సూచన

పాలకొల్లు: జూన్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం లో కాలువలు జూన్ ఒకటో తారీఖున గోదావరి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వం వారు తెలియజేశారు కావున రైతు సోదరులు అందరు కూడా జూన్ మొదటి వారంలో నారుమడలు వేయడానికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాము ఖరీఫ్ లో వరి రకాలు ఎంటియు 1318 ఎం టి యు 7029 అలాగే 12:93, 12 82, 1140,సంపద స్వర్ణ,ఈ వెరైటీలు అన్నీ కూడా సాగుకు అనుకూలము రైతు సోదరులు సమాయత్తమయి…

Read More

ఆక్వా రైతులను సీఎం ఆదుకోవాలి. -మాజీ ఎమ్మెల్సీ అంగర విజ్ఞప్తి

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా కాలంగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడటానికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని, రైతులను ఆదుకోవాలని అంగర విజ్ఞప్తి…

Read More

రొయ్యలు, చేపలతో జూన్, 8న పేదలకు ఉచిత భోజనాలు. -పాలకొల్లు ఆక్వా రైతు సంఘం.

పాలకొల్లు: మే, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దోపిడీ కోరల్లో చిక్కుకున్న రొయ్యల రైతులకు విముక్తి కలిగించడానికి వినూత్న పద్ధతులు అన్వేషిస్తున్నట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా, శనివారం పత్రికా సమావేశంలో మాట్లాడారు. రొయ్యలకు స్థానిక మార్కెట్లో డిమాండ్ సృష్టించటానికి ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపారు. పట్టణ వార్డుల్లో, గ్రామాల్లో ఉన్న చిరు వ్యాపారులకు రొయ్యలు నిలవ చేసే ఫ్రిడ్జ్ లో…

Read More

అమలాపురంలో ఆక్వా రైతు సదస్సు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రారంభించిన ఉద్యమం లో భాగంగా ఈ నెల 29న అమలాపురంలో రొయ్యల రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్టు, జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం తెలిపారు. రొయ్య సీడు నాణ్యత, ఫీడు ధరల పెంపు, రొయ్య ద్వారా తగ్గించటం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల రైతులను సమాయత్త పరచడానికి…

Read More

ఆక్వా రంగ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ బంధుప్రీతే కారణం. మాజీ ఎమ్మెల్యే ముదునూరి తీవ్ర ఆరోపణ.

నరసాపురం: మే, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వ బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం వల్లే ఆక్వా రంగం సిండికేట్ల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆక్వా రైతు నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు తీవ్రంగా ఆరోపించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాలు సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఆక్వారంగాన్ని కూడా సంక్షోభంపాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర జి డి…

Read More