Telugu News Power

జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించిన ప్రముఖ నటి లక్ష్మి.

భీమవరం: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ రంగస్థలం నటి, ముమ్మారు నంది అవార్డు గ్రహీత బొండాడ (భీమవరం) లక్ష్మి (61) తన జీవిత రంగస్థలం నుంచి ఆదివారం రాత్రి తన పాత్ర ముగించి, రంగస్థలం నుంచి కూడా నిష్క్రమించారు. ఈమె భర్త టైలరింగ్ చేస్తారు. కుమారుడు మధు డాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తారు. భీమవరానికి చెందిన లక్ష్మీ నాలుగున్నర దశాబ్దాల రంగస్థల చరిత్రలో బహుముఖ పాత్రలు పోషించి, నాటక సామ్రాజ్నిగా వెలుగొందారు. ఆమె నాటిక, నాటకం,…

Read More

డీజిల్ పెట్రోల్ కొరత లేదు. -జె సి రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో రోజుకు మూడు లక్షల లీటర్ల డీజిల్ ఆయిల్ అవసరం కాగా, రోజు 4.5 లక్షల లీటర్ల సరఫరా అవుతుందని ఆదివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందువల్ల డీజిల్ కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వ్యవసాయ మధ్య పరిశ్రమకు సంబంధించి ప్రాధాన్యత రంగాలకు తగిన విధంగా డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు విఆర్ఓ ద్వారా కూపన్లు…

Read More

జోన్లు ఏర్పాటులో ఉద్యోగుల తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. -ఉద్యోగ సంఘ నేత శ్రీకాంతరాజు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తగా ఏర్పాటు చేసే జోనల్ విధానాల్లో ఉద్యోగుల ను భాగస్వాములను చేయటానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీకాంతరాజు డిమాండ్ చేశారు. స్థానిక పింఛనుదారుల సంఘ భవనంలో ఆదివారం జరిగిన మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ, డి.ఏ.బకాయల విడుదల, పి ఆర్ సి కమిటీ…

Read More

చర్లపల్లి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

నర్సాపురం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ నుంచి నరసాపురం – చర్లపల్లి (17061 / 17062) ఆదివారాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం రాత్రి 8 గంటలకు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ , నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. నరసాపురం–హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే…

Read More

ఉద్యానవన పంటలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం.

అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం కోరారు. పంటలు 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు…

Read More

స్వాతంత్ర్య సమరయోధులు, విద్యాదాత డి. ఎన్. ఆర్. విగ్రహావిష్కరణ!

భీమవరం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, మహనీయులు, “సంకల్ప జీవి” దంతులూరి నారాయణ రాజు గారి విగ్రహాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ, ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖమాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఆవిష్కరించారు.విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి, 1945లోనే భీమవరంలో కళాశాలను స్థాపించి, సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప కృషీవలుడు నారాయణ రాజు సేవలను మంత్రి కొనియాడారు. దేశభక్తుడు, విద్యాదాత వంటి గొప్ప మహనీయుని విగ్రహాన్ని…

Read More

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.

ముంబై: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్,ఈ అవార్డును ముంబై లో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు గుర్తింపు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడం,…

Read More

విద్యా చైతన్య సమాఖ్య టాలెంట్ టెస్ట్ బహుమతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విద్యా చైతన్య సమాఖ్య నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎడ్ల దుర్గ కిషోర్, డాక్టర్ కొండపల్లి లెనిన్, పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే,సంస్థ అధ్యక్షులు దిరిశాల వెంకట ప్రసాద్, కార్యదర్శి పోలిశెట్టి శ్రీశ్రీ, తోలేటి గాంధీ, మంచెం కనకరాజు, కింజరపు దుర్గాప్రసాద్,మంచెం ఉమామహేశ్వరరావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎర్ర అజయ్…

Read More

లయన్స్ ఫెమినా ఆరోగ్య కార్యక్రమం.

పాలకొల్లు; ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) లయన్స్ ఇంటర్నేషనల్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా, స్థానిక లయన్స్ ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో ఉల్లంపర్రు, మాంటిసోరి, పాఠశాలలో శనివారం హెచ్.పి.వి టీకా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో 125 మంది యువతులకు టీకాలు వేశారు. ఇటీవల మహిళలకు సర్వికల్ క్యాన్సర్ పెనుముప్పుగా మారింది. దీని నివారణకు హెచ్ పి వి టీకా అందుబాటులో ఉంది. ఖరీదైన టీకా అందరూ వేయించుకోలేని పరిస్థితి. లయన్స్ ఇంటర్నేషనల్ సామాజిక…

Read More

హైదరాబాద్ కు ఆదివారాల రైలు రేపటి నుంచి ప్రారంభం.

నరసాపురం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) లోక్ సభ స్థానం ప్రధాన కేంద్రం నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికుల కోసం మరో వారాంతపు రైలు సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కృషితో ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యాలు మీరు అవుతున్నాయి. వీరి కృషితో నరసాపురం – హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా…

Read More