Telugu News Power

వీరవాసరంలో “అన్నదాత మీకోసం”

వీరవాసరం: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి బుధవారం వీరవాసరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా నేరుగా 20 వేల రూపాయల సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. ఇంకా ఎవరికైనా జామకాయ ఎడల రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి…

Read More

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

                                                       వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Read More

అమరజీవికి ఘన నివాళి.

పాలకొల్లు: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి పాలకొల్లు సోమవారం ఘనంగా ఆర్యవైశ్య ప్రముఖులు నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న విగ్రహానికి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, మాటూరు నరసింహమూర్తి, నాళం బాపిరాజు, మన్యం జగ్గమ్మ సత్రం…

Read More

కళాపరిషత్ నాటికోత్సవాల్లో విజేతలు వీరే.

పాలకొల్లు: మార్చి ,16 (తెలుగు న్యూస్ పవర్. కాం) పాలకొల్లు కళాపరిషత్ మూడు రోజులపాటు నిర్వహించిన నాటిక పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రాష్ట్ర జలవలూర్ల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బహుమతి ప్రధానోత్సవం చేశారు.పాలకొల్లు కళా పరిషత్ జాతీయ స్థాయి నాటికల పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెప్పిన బొమ్మ బహుమతి పొందింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ఖరీదైన…

Read More

రాష్ట్ర అవతరణ రూపశిల్పికి, త్యాగ శిల్పంతో ఘన నివాళి.

అమరావతి: మార్చి,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చారిత్రాత్మకమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతిలో ఏర్పాటుచేసిన 58 అడుగుల త్యాగ శిల్పం కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సరసన విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” నిలుస్తుంద న్నారు. ఈ ఆవిష్కరణ…

Read More

ప్రతిభావంతులను ప్రోత్సహించాలి -ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.

భీమవరం: మార్చి,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) దాతలు ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని, స్థానిక ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. దాతలు ఇచ్చిన ఉపకార వేతనాలను సోమవారం, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం లోజరిగిన సమావేశంలో విద్యార్థులకు . సుమారు 10 లక్షల 98 వేల రూపాయలను,111 విద్యార్థులకు అందజేశారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 43 మంది దాతల సహకారంతో పట్టణంలోని ప్రతిభావంతులైన…

Read More

పండగలకు నిధులు కేటాయించాలి-జిల్లా బిజెపి.

భీమవరం: మార్చి, 16(తెలుగు మూవీస్ పవర్.కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో రానున్న ఉగాది,వసంత నవరాత్రులు మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించి, తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలోని “జనతా-వారధి” జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఇంజటి వెంకటేశ్వర్లు ప్రతినిధి బృందం మరియు బిజెపి నేతలతోకలసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసారు.

Read More

ఆర్ఎస్ఎస్ పై అమెరికా కమిషన్ కన్నెర్ర.

అమెరికా: మార్చ్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్, భారత దేశానికి చెందిన ఆర్ఎస్ఎస్ పై కన్నెర్ర చేసింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ సోమవారం భారతీయ స్వయంసేవక్ సంఘ ఒక గూడచారి సంస్థ గా అభివర్ణించింది. ఈ సంస్థ పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశంలో మత స్వేచ్ఛ ఏ పరిస్థితుల్లో ఉందో నిజనిర్ధారణ చేయటానికి అనుమతించాలని కోరింది. భారతదేశాన్ని ఆందోళన కలిగించే దేశాల సరసన చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి…

Read More

వంట గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల మంత్రి మనోహర్ సమీక్ష.

అమరావతి: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కాం)ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అధికారులతో సోమవారం ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై సమీక్ష సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సిలిండర్ల సమయానికి సరఫరా, బుకింగ్ నుండి డెలివరీ వరకు జరుగుతున్న ప్రక్రియలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా…

Read More

ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ‘ఉప్పలపాటి’

భీమవరం: మార్చ్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు ఘనవిజయం సాధించారు. ఏపీ బార్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా, కేంద్ర సహాయ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ,న్యాయవాదులు, బిజెపి నాయకులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు. న్యాయవాద వృత్తిలో వారికి ఉన్న అపారమైన అనుభవం మరియు నిబద్ధత, బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదుల సంక్షేమానికి, వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.

Read More