ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలలి, రాష్ట్ర రైతు సదస్సు డిమాండ్.
వీరవాసరం: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్ . కామ్) సిండికేట్ల కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రొయ్యల రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయాలని పాలకొల్లు శ్రీ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, పాలకొల్లు ఏఎంసి చైర్మన్ గొట్టుముక్క గాంధీ భవన్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల భారీ సదస్సు ఆదివారం వీరవాసరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. సదస్సుకు పాలకొల్లు, ఆచంట, నరసాపురం తూర్పుగోదావరి, కృష్ణ తదితర జిల్లా…