Telugu News Power

శ్రామికులకు మంత్రి విందు

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న శ్రామికులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తిస్తూ, వారికి చీరలు బహుమతిగా ఇస్తూ, విందు భోజనం ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా, శనివారం స్థానిక చింతపర్రు గ్రామంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించిన దాతలకు, శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన మంత్రి పదవిని…

Read More

ఫీడ్ రేట్ల పెంపు పై రొయ్యల రైతుల ఫైర్ ఈ నెల 16 నుంచి ఉద్యమ కార్యాచరణ అవసరమైతే చలో అమరావతికి పిలుపు.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అకస్మాత్తుగా, ఎవరి అనుమతులు లేకుండా, రాత్రికి రాత్రే, దొడ్డిదారిలో అడ్డంగా పెంచిన ఫీడ్ ధరలపై ఆక్వా రైతులు ఫైర్ అయ్యారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో చందపర్రు త్రిబుల్ ఎస్ కళ్యాణమండపం లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వీడు ధరలు పెంచవద్దని తాము ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా, పెడచెవిన పెట్టి ఒక్కసారిగా కిలోకు 10 నుంచి…

Read More

రిటైర్ అయినా, అక్రమ చర్యలపై వేటు తప్పదు. -కొరడా ఝులిపించిన కూటమి ప్రభుత్వం.

అమరావతి: జూన్,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) పదవిలో ఉన్న, లేకున్నా అధికారులు చేసిన తప్పిదానికి తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, కూటమి ప్రభుత్వం శుక్రవారం జీ. ఓ. విడుదల చేసింది. తొలిసారిగా ఈ జీవో ద్వారా రిటైర్డ్ తహసీల్దార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక ఉపేక్షించకుండా, అవినీతిపై కఠిన చర్యలు కోసం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉద్యోగ విరమణ (రిటైర్) చేసినా సరే, తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని ఈ ఉత్తర్వు ద్వారా…

Read More

మాస శివరాత్రి రోజు రుద్ర హోమం.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో శనివారం మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం నిర్వహించారు. పలువురు దంపతులు భక్తిశ్రద్ధలతో హోమం, పూజలు జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న భక్తులచే పూజలు జరిపించారు. సాయంత్రం లీలా కళ్యాణ మండపంలో లీలా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల…

Read More

అమ్మ ట్రస్ట్ చే అనాధకు మృతదేహానికి అంత్యక్రియలు.

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ లో ఓ అనాధ మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కు రైల్వే పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని స్థానిక ఎడ్ల బజార్లో ఉన్న స్మశాన వాటికకు తరలించి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ట్రస్ట్ సభ్యులు మణికంఠ, నాయుడు, దీపేష్,భార్గవ్ అధ్యక్షులు అంబటి సాయి తేజ, ఈ కార్యక్రమంలో తమ సేవలు…

Read More

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత.

న్యూఢిల్లీ: భారత షూటింగ్ రంగానికి చెందిన దిగ్గజ క్రీడాకారుడు, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో కన్నుమూశారు. రాణా శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం భారత పిస్టల్ షూటర్ల హై-పర్ఫార్మెన్స్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ఇటీవల జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన ఐ ఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ కప్ పోటీలకు హాజరయ్యారు. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న…

Read More

బిజెపి సైకిల్ ర్యాలీ

పోడూరు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి ప్రభుత్వం, మోడీ ప్రధానిగా గత పుష్కర కాల పాలనకు విజయోత్సవ సూచకంగా మండల బిజెపి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు చింతపల్లి రమేష్ శెట్టి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పార్టీ శ్రేణులు మండలంలోని 14 గ్రామాల్లో, 41 కిలోమీటర్ల పరిధిలో జరిగిన ఈ సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల బిజెపి ఇన్చార్జ్, జక్కంపూడి కుమార్ మోదీ పిలుపుమేరకు…

Read More

మహిళల రక్షణ పై అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: జూన్ ,12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వివిధ సందర్భాలలో, వివిధ రూపాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి ఉన్న చట్టాల గురించి స్థానిక సీఐ కోలా రజిని కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో శుక్రవారం కార్యక్రమం జరిగింది. స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులకు, మహిళా సాధికారిత, మహిళలపై దాడులు, సైబర్ నేరాలతో వేధించటం, ఫోక్సో చట్టం అంశాలపై సి ఐ…

Read More

వైయస్సార్ పార్టీ భారీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్)మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన కార్యక్రమం స్థానిక నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రజలు కు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రజలు కు ఇచ్చిన హామీలు అమ్ములు జరపక మోసం చేసినందుకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. వైసీపీ ఇంచార్జ్ గుడాల గోపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూలపల్లి…

Read More

యలమంచిలి లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సు.

యలమంచిలి: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తమ్మినీడి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో శుక్రవారం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమం పై అవగాహన శిబిరం నిర్వహించారు. తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సమగ్రంగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా తయారీకి సంకల్పించినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు ఈ…

Read More