గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికకు రంగం సిద్ధం. రేవులో రాకపోకలు బంద్.
అమరావతి:జూలై,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏ పీ ఎస్ డి ఎమ్ ఏ) అప్రమత్తత హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…