Skip to main content

Telugu News Power

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికకు రంగం సిద్ధం. రేవులో రాకపోకలు బంద్.

అమరావతి:జూలై,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏ పీ ఎస్ డి ఎమ్ ఏ) అప్రమత్తత హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…

Read More

రాష్ట్ర పండుగగా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.

అమరావతి: జులై 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్ని కుల క్షత్రియులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ పూర్ణమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చిలకలపూడి పాపారావు స్థానిక తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. చక్కని కురుక్షత్రియ చిరకాల మంచ నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, సహకరించిన…

Read More

భోగాపురం విమానాశ్రయంలో థింసా నృత్యానికి ప్రపంచ రికార్డు.

విశాఖపట్నంభోగాపురం:జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో 13,500 మంది గిరిజన మహిళలు, కళాకారులు ఒకేసారి థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన ధింసా నృత్యాన్ని ఒకే వేదికపై భారీ స్థాయిలో ప్రదర్శించడం…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేక పూజలు ప్రారంభం.

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు దండిగా పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం స్థానిక శాసన సభ్యులు, జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశములు మేరకు శ్రీ స్వామివారికి జలాభిషేకం పూజలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రుద్ర గాయత్రీ జపములు, నమకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, అభిషేకములు జరుగు ఈ ఏకాదశ క్రతువులో అభిషేక పండిట్లు అర్చకులు , రుత్వికులతో విశేషపూజలు నిర్వహిస్తారు. ఉదయం…

Read More

సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి.

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో భేటీ మంగళగిరి: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడుకు సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన…

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. -ఆక్వా రైతు సంఘం హెచ్చరిక.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సభ కోనసీమ జిల్లా నుంచి ప్రారంభించి, రాష్ట్ర రాజధాని అమరావతికి, అక్కడ నుంచి దేశ రాజధాని…

Read More

సార్వా కు సాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) సార్వా లో రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక నీటిపారుదల సలహా మండలి సమావేశంలో…

Read More

జిల్లాలో కొత్త పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలకు అనుమతులు, మౌలిక వసతులు, బ్యాంకు రుణాలు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా వచ్చిన…

Read More

నేడు యలమంచిలిలో ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

యలమంచిలి:జూలై,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి శుక్రవారం మండలంలో పర్యటిస్తారని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ గురువారం తెలిపారు. ఈ పర్యటనలో మండలంలో గల 11 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, యూపీ పాఠశాలలలో లో ఎంమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సంఘ బాధ్యులు, కార్యకర్తలు ఎక్కువమంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలలకు సమీపంలో…

Read More

దస్తావేజు లేఖర్ల కు బీసీ నాయకుల మద్దతు.

పాలకొల్లు: జులై, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం గురువారం ముగింపు దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రిజిస్ట్రార్ కార్యాలయాల కార్యకలాపాలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రవేశం కల్పిస్తూ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం పెసరట్టుగా ఉపసంహరించుకోవాలని నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వివిధ సంఘాల, పార్టీల ప్రముఖ నాయకులు స్వయంగా వచ్చి పలువురు వీరికి మద్దతు…

Read More