Skip to main content

Telugu News Power

Telugu News Power

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కి ఎట్టకేలకు పదవి. గౌరవప్రదంగా సాగనంపుతున్న కూటమి ప్రభుత్వం.

అమరావతి: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం నియమించింది. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఈమెను సాధారణ పరిపాలన శాఖకు ( జి ఏ డి ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.​ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ( జి ఏ డి ) పరిధిలోని పాలనా…

Read More

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -కలెక్టర్ పిలుపు.

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 1,151 పోలియో చుక్కలు వేసే కేంద్రలు ఏర్పాటు చేసారు. జిల్లాలో 1.74 లక్షలకుపైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టామని కలెక్టర్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయ నిధి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం. విరివిగా భక్తుల విరాళాలు.

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ ప్రాజెక్ట్ ప్రత్యేక కౌంటర్ గురువారం ప్రారంభించారు. భక్తుల నుండి బంగారం విరాళం గా సేకరించే కార్యక్రమం నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను స్థానిక శాసన సభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, సత్యవాణి దంపతులు ప్రారంభించి,…

Read More

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జేష్టమాస దీక్ష.

మంగళగిరి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా…

Read More

నేడే గజమాల యాత్ర మహోత్సవం ప్రారంభం.

మొగల్తూరు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముత్యాలపల్లి లో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ బండిముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం 9:00 గంటల నుంచి గజమాల యాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాల తిరుపతిగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లోని అప్పనపల్లి దేవస్థానం చైర్మన్ మొల్లేటి చక్రపాణి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాత శ్రీ శ్రీ మొల్లేటి రామస్వామి పుణ్య దంపతులు అప్పనపల్లికి పేరు రావడానికి…

Read More

వైభవంగా శ్రీవారి కల్యాణ వేడుకలు.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బాలికల పాఠశాల వద్ద గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శేషాద్రి హాస్పిటల్ అధినేతలు, ప్రముఖ వైద్యులు గుణ్ణం నారాయణరావు, సుజయ శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. పురోహితులు శశికాంత్ (తణుకు), కృష్ణ చైతన్య తదితరులు స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి పలువురు దంపతులు, భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ఈవో…

Read More

పి-4 ఉన్నత పాఠశాల ప్రారంభించిన మంత్రి లోకేష్.

మోపిదేవి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో ఉన్న వారంతా ఏకత్రాటి…

Read More

పేద రోగులకు వాకర్స్ క్లబ్, మందుల వితరణ.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)కోనసీమ జిల్లా రావులపాలెం కు చెందిన ఇద్దరు పేద అనారోగ్య బాధితుల గురించి పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా వాకర్స్ క్లబ్, పాలకొల్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని మందులు కొనుగోలు చేయలేని తమ పరిస్థితిని తెలుపగా స్పందించిన అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు క్లబ్ తరపున కిడ్నీ, లివర్ వ్యాధితో బాధపడుతున్న భోగిశెట్టి నాగేశ్వర రావు కు రూ.25 వేల విలువైన మందులు, టైప్ -1 డయాబెటిస్ తో…

Read More

ముద్రగడ కుమార్తె క్రాంతిపై మండిపడ్డ పద్మనాభరెడ్డి.

హైదరాబాద్:జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తన కుమార్తె భార్లపూడి క్రాంతిపై మండిపడ్డారు. గతంలో తన సతీమణి క్యాన్సర్ చికిత్స అనంతరం విశ్రాంతి కోసం హైదరాబాద్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లిన సందర్భంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆయన ఆరోపించారు. కుటుంబ విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ముందుకు తీసుకురావడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు . ప్రస్తుతం తమ కుటుంబాన్ని అన్ని విధాలా…

Read More

నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుని వైద్యానికి రూ. లక్షన్నర సాయం.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)నిరుపేద పురోహితులు నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుడు సాయిశ్రీరామ్ వైద్యం నిమిత్తం దాతలు పెద్దమనసుతో ముందుకు వచ్చి సుమారు లక్షా యాభైవేల రూపాయల ఆర్ధిక సహకారం అందించారని, తెలుగుదేశం నాయకురాలు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పెండ్యాల భవాని బుధవారం తెలిపారు. శ్రీ గాయత్రీ స్మార్త పురోహిత సంఘ అధ్యక్షులు, నుదురుమాటి శ్రీనివాస్ శర్మ , ప్రధాన కార్యదర్శి ఈరంకి కాశీవిశ్వనాధం, శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘ…

Read More