Skip to main content

Telugu News Power

Telugu News Power

టూరిస్ట్ బస్సు ఆపరేటర్లకు భారీ ఊరట, కూటమి ప్రభుత్వ వరం. -బస్సు ఆపరేటర్ల కృతజ్ఞతలు. -మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ.

అమరావతి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఏఐటిపి) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో ఈ ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించి, ఆమోదించింది. ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4 వేలు గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు భారీ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో సుదర్శన హోమం. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

భీమవరం: జూన్,24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం ఆవరణలో లోకకళ్యాణార్థం సుదర్శన హోమం నిర్వహించారు. దుష్టశక్తుల నివారణకు,ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాల కోసం, కుటుంబ సౌఖ్యం, గ్రహదోష నివారణ కోసం, వ్యాపార వృద్ధి, నిర్మాణ రంగం అభివృద్ధి కొరకు బుధవారం దశమి, చిత్త నక్షత్రం కలిసి, దశ పాప హరం ప్రాముఖ్యత గల రోజున సుదర్శన…

Read More

వచ్చేనెల 1న వాసవి మాత విగ్రహ ప్రతిష్ట.

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నరసాపురం రోడ్డులో ఉన్న గా మాస్ కళ్యాణమండపం ఆవరణలో కోటిన్న రూపాయలతో నిర్మించిన అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తరలి రావాలని వైశ్య ప్రముఖులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక స్థానిక కంచర్ల పురుషోత్తం వాసవి కళ్యాణ మండపం లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గారి జనార్ధన గుప్త వివరాలు వెల్లడించారు. విగ్రహ…

Read More

వైసిపి పాలనలో దేవాదాయ శాఖ నిర్వీర్యం. -మంత్రి ఆనం ఆరోపణ

తిరుమల: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసిపి ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. మంత్రి మంగళవారం తిరుమలలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క శాఖ కూడా అధిపతి లేకుండా ఐదేళ్లు అస్తవ్యస్త పాలన సాగించిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ, అంతర్వేది రథం దహనం, రామతీర్థం విగ్రహ ఖండన వంటి హిందూ వ్యతిరేక దుర్మార్గాలకు ఒడిగట్టారని విమర్శించారు. ఆ…

Read More

పశు సంపద కోసం రైతులకు అవగాహన కార్యక్రమం. -మంత్రి అచ్చెం నాయుడు

విజయవాడ: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో, పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పి ఎం డి ఎస్)” రుతుపవనాలకు ముందేపూడి…

Read More

అమోనియ లీకేజీ పట్ల తుందుర్రు గ్రామస్తుల ఆందోళన.

వీరవాసరం : జూన్, 23{ తెలుగు న్యూస్ పవర్. కామ్ ) ఇటీవల తమిళనాడులో రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన అమోనియా లీకేజీ సంఘటన పట్ల తుందురువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న రియల్ ఫ్యాక్టరీలో సంభవించిన అమూల్య లీకేజీ ప్రమాదం వల్ల 8 మంది మృతి చెందగా, 80 మంది ఆసుపత్రి పాలైనట్టు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన గోదావరి మెగా ఫుడ్ పార్క్ వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటని…

Read More

జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ పరిశీలకుల నియామకం.

మంగళగిరి: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి ‘సమాచార సేకరణ కమిటీ’లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని…

Read More

బడుగు బ్రాహ్మణ కుటుంబానికి ఆర్థిక సాయం.

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం మరోసారి తన ఔదార్యం చాటుకున్నది. బడుగు బ్రాహ్మణ కుటుంబానికి, తమ సంఘ సభ్యుల సౌజన్యంతో 30 వేల రూపాయల ఆర్థిక సహాయంతో ఆదుకునే ప్రయత్నం చేసింది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పురోహితునిగా సేవలందిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈ సాయం అందించారు. వీరి కుమారుడు సాయి శ్రీరామ్ గత కొంతకాలంగా అరుదైన చర్మ వ్యాధితో…

Read More

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుఖశాంతులు. ఓర్వలేని వైసిపి పార్టీ -కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి

నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. కొత్తపల్లి సోమవారం నరసాపురం వారి స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సంతోషం చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ సమస్యలు సృష్టించటానికి అవాకులు చవాకులు మాట్లాడటం మంచిది కాదని హేతువు పలికారు. అంబేద్కర్ కాల్షియం జిల్లాకు చెందిన వైసీపీ…

Read More

రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం నిషేధం.

న్యూఢిల్లీ: జూన్,22 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్ విశ్వాస్ చట్టం-2026 క్రొత్త నిబంధనల ప్రకారం రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా విధిస్తారు. అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం అమలులోకి వచ్చింది. జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5 వేల జుర్మాన వేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దింపేసేలా అధికారులకు వీలు కల్పించారు. రైలు ప్రయాణికుల భద్రత, ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు…

Read More