రైతు కుటుంబాల ఆనందానికి కూటమి ప్రభుత్వం అండ. -మంత్రి నిమ్మల
పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల కుటుంబాల్లో ఆనందానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ. 5.15 కోట్ల నిధులతో జరుపు తలపెట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెల్లపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 46’లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ. 8,965 కోట్ల రూపాయలు…