Skip to main content

Telugu News Power

Blog

సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ గా రాహుల్ కుమార్ రెడ్డి నియామకం.

భీమవరం: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతిష్టాత్మక సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా రాహు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ రాహుల్ రెడ్డిని బుధవారం అభినందించారు.

Read More

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

విజయవాడ: జూలై,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అభిమాని మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి,నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్…

Read More

పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకం- నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల.

తాళ్లపూడి : జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టిన పట్టిసీమ తాళ్లపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మన రామానాయుడు పూజలు చేసి, జల హారతి ఇచ్చి నీటిని బుధవారం విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు చుక్క నీరు లేని పరిస్థితుల్లో కూడా ఈ పథకం ద్వారా కృష్ణాజిల్లాకు 450 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు….

Read More

హస్త కళాకారుల కోసం ఆరోగ్య శిబిరాలు.

ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న పవన్ కళ్యాణ్. విజయవాడ: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. పవన్ కళ్యాణ్ సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా…

Read More

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు.

పాలకొల్లు: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కం) మాజీ ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సృష్టికర్త, మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలు వాడవాడల బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక యల్లవాని గురువు వై- జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సిపి పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా, పూలమాలలు…

Read More

వాకర్స్ క్లబ్ నోటు పుస్తకాలు పంపిణీ.

యలమంచిలి:జూలై, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా యలమంచిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆర్యపేట విద్యార్థులకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటపర్తి సుధాకర్, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవ రాజు, కోశాధికారి పోతుల ఉమా శంకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, విద్యా వాలంటీర్ బి.సునంద పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు…

Read More

పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కె. ఆర్.

భీమవరం: జులై, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కే.ఆర్.ను ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్త కలెక్టర్ గా పని చేశారు. కల్పశ్రీ కె. ఆర్. 2022 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలనా సేవ (ఐఏఎస్) అధికారిణి. ఆమెకు ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించారు. వీరిది సాధారణ గ్రామీణ నేపథ్యం. యూ పి ఎస్ సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన స్ఫూర్తి ప్రదాతగా…

Read More

అగ్రిగోల్డ్ బాధితుల కోసం మంత్రుల బృందం ఏర్పాటు.

అమరావతి: జూలై, 7( తెలుగు న్యూస్ పవర్. కాం) అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల బృందం మంగళవారం వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశంలో రాష్ట్ర మంత్రులునాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యం కుమార్ యాదవ్ (వీడియో కాన్ఫరెన్స్ లో) పాల్గొని, అగ్రిగోల్డ్ కేసుల పురోగతి, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.బాధితుల హక్కుల పరిరక్షణకు, వారికి…

Read More

టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం.

గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్టాల్స్…

Read More

క్యాన్సర్ మరణశిక్ష కాదు. ఆ భయాన్ని మర్చిపోండి. ప్రపంచ ప్రసిద్ధ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు పిలుపు. ఈ ఏడాది 15 లక్షల క్యాన్సర్ కేసులు ఐ సి ఎం ఆర్ ప్రకటన.

జనరల్ డెస్క్: జూలై,7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్యాన్సర్ ఇక ఎంత మాత్రం మరణశిక్ష కాదని ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాన్సర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏడాది 15 లక్షల కొత్త క్యాన్సర్ రోగులు పుట్టుకొస్తారని ఇండియన్ హోల్ సేల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎం ఆర్) నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. క్యాన్సర్…

Read More