Telugu News Power

Blog

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడుకు, చంద్రబాబు నాయుడు ప్రశంస.

అమ‌రావ‌తి, మే 8: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ, పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగం స్వర్గ పనిచేయడానికి తోడ్పడుతున్నాయి. గతంలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు, ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే ఫైళ్లను పరిష్కారం…

Read More

రేట్లు పెంచే దాణా కంపెనీలను బహిష్కరిస్తాం. -రొయ్యల రైతులు హెచ్చరిక

పాలకొల్లు:మే, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల దాణ ధరలు ఎవరు ముందు పెంచితే, వారి ఉత్పత్తులు బహిష్కరిస్తామని రొయ్యల రైతులు తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా సంఘం శుక్రవారం సమావేశమై, ఈ నిర్ణయం ప్రకటించారు. సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముడి సరుకుల ధరలు పెరిగాయని వెంటనే ఫీడ్ ధరలు పెంచడం పట్ల రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో మూడేళ్ల పాటు…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రైల్వే అధికారిణి ఇతి పాండ్య.

పాలకొల్లు: మే,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండ్యా దర్శించుకున్నారు. ఈమె, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.స్వామీవారు అమ్మవార్లూను దర్శనమునం చేసుకున్నారు. దేవస్థానం తరపున అధికారులు శేష వస్త్రం తో సత్కరించినారు. వీరికి పూజా కార్యక్రమాలు, నిర్వహించి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప అనిల్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో సీనియర్…

Read More

కోనసీమ జిల్లా వానపల్లిలో పెళ్లి భోజనం తో 50 మందికి అస్వస్థత.

వానపల్లి: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి శివారు రామ్మోహన్రావుపేటలో వెళ్లి భోజనం తిన్న 50 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆసుపత్రికి వెళ్లి, అనారోగ్యం పాలైన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళిత ఓడలో ఒకే గ్రామానికి చెందిన, వధూవరులు పెళ్లి జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మాంసాహార విందు భుజించిన వారికి ఫుడ్ పాయినింగ్ జరిగిందని తెలిపారు. తక్షణమే వీరిని వానపల్లి ప్రభుత్వాసుపత్రికి, కొంతమందిని…

Read More

జిల్లా కలెక్టర్ నాగరాణికి ముఖ్యమంత్రి ప్రశంసలు.

అమరావతి: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా “సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్” రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల తో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇచ్చిన వినూత్న ప్రణాళిక పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి అర్థం చేశారు. వ్యవసాయ, ఆక్వా, పశుసంపద వ్యర్థాలను బయో ఉత్పత్తులుగా మార్చి వేస్ట్ టు వెల్త్,(వ్యర్థం నుంచి అర్థం)మోడల్‌తో పారిశ్రామిక అభివృద్ధికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యాచరణ…

Read More

అల్లూరి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. -వర్ధంతి సభలో వక్తల పిలుపు.

భీమవరం:మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి సభలో ఎమ్మెల్యే అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నివాళులర్పించారు. జిల్లా కేంద్రం భీమవరం జెపి రోడ్డులోని, అల్లూరి స్మృతి వనం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర…

Read More

శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న పెదగోపురం ధర్మకర్తల మండలి.

పాలకొల్లు: మే, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చిన్న గోపురంలో వేంచేసియున్న చతుర్భుజ లక్ష్మీ తాయారు సమేత, శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు, గురువారం పెద గోపురం ఆలయ ధర్మకర్తల మండలి పూజలు నిర్వహించారు. శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు, పినిశెట్టి శ్రీనివాస్ (చిన్ని) బసవ సత్యనారాయణ తదితరులు, ఏఎంసి డైరెక్టర్ బెట్ట…

Read More

పంచాయతీ కార్మికుడ్ని విధుల్లోకి తీసుకోవాలి. -వర్కర్స్ యూనియన్, సిఐటియు డిమాండ్.

యలమంచిలి: మే, 7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నేరేడుమిల్లి పంచాయతీ లో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కృష్ణంరాజును డ్యూటీకి రావద్దని చెప్పడం అన్యాయమని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్, మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల కమిటీ ఆధ్వర్యంలో నేరేడుమిల్లి పంచాయతీ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆంజనేయులు అధ్యక్షులు మానుకొండ శివరావు సిఐటియు…

Read More

చవాకుల ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు.

పాలకొల్లు: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పాలకొల్లు రైల్వే గేట్ వద్ద ఏర్పాటుచేసిన రస్నా చలివేంద్రం కేంద్రం వద్ద పలువురు బాటసారులకు గురువారం దాహార్తిని తీర్చారు .ఈ ఈ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెచ్చెట్టి వెంకట నరసింహారావు (బాబు) విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ బాబు ,…

Read More

విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి.

భీమవరం: మే,7(తెలుగు న్యూస్ పవర్. కాం) విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం, స్థానిక అడ్డవంతెన వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలు వేసి ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తిఘనంగా నివాళులర్పించారు. ఈ ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పిడిఎఫ్ ఎమ్మెల్సీ, అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అందించే ఘన నివాళి అన్నారు. అల్లూరి ప్రజలను సమీకరించి, పోరుబాట పట్టించి స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని కొనసాగించారన్నారు. సామాన్య ప్రజల కోసం తన…

Read More