Telugu News Power

Blog

నిత్య అన్నదాన పథకానికి రామడుగుల లక్ష విరాళం.

భీమవరం: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు రూపాయలు విరాళం సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచన పూజలు చేశారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారు. ధర్మకర్తల మండలి సభ్యులు…

Read More

పంచారామ క్షేత్ర మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం, సాయంత్రం, సప్త ప్రదక్షిణాల్లోభాగంగా మాడవీధులలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ,శ్రీ స్వామివారి పంచహారతుల సేవ నిర్వహించి నట్లు కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు.

Read More

మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుకున్న శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 110వ రక్తదాన శిబిరం నిర్వహించారు. పేద మహిళలకు చీరల వస్త్ర దానం చేశారు. రక్తదానం చేసిన యువకులను మంత్రి అభినందించారు. స్థానిక గాంధీ బొమ్మల…

Read More

మాజీ హోం మంత్రి ‘చేగొండి’ కి మంత్రి నిమ్మల శుభాకాంక్షలు.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, రాజకీయ కురువృద్ధులు చేగొండి జోగయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా కలిసి, హరిబాబును సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి నుంచి నిమ్మల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరిబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు,…

Read More

భవిష్యత్తుపై వైసీపీలో అలజడి -మంత్రి నిమ్మల రామానాయుడు

యలమంచిలి; ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) భవిష్యత్తుపై వైసీపీ లో అలజడి మొదలైందని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్థానిక మేడపాడు గ్రామాభివృద్ధికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల నిధులతో ప్రారంభం కాబోయే పనులకు ఆదివారం మంత్రి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ బయటకు వచ్చి సొంతంగా పత్రికా సమావేశాలు నిర్వహించకుండా నిరోధించాలని చూస్తున్నారన్నారు. జగన్ కు ఇచ్చిన స్క్రిప్ట్…

Read More

యువత జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి జగ్జీవన్ రామ్ 119వ సందర్భంగా, కలెక్టరేట్ వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, కులరహిత సమాజ నిర్మాణానికి, జీవితాంతం కృషి చేసిన గొప్పనేత బాబు జగ్జీవన్ రామ్ ను కలెక్టర్ కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొని,ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు….

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 17 గ్రాములు బంగారం కానుకగా సమర్పించిన భక్తులు.

భీమవరం: ఏప్రిల్, 5 (తెలుగు న్యూస్ పవర్.కాం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారులు, వడ్డీ దివ్య, వీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం మరియు మోటూరు కి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు,వీరికి…

Read More

వచ్చేవారం పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు – రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్.కామ్) నర్సాపురం(07219/07220)నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) మరియు బెంగళూరు(07153/07154) (ఎస్ఎంవిబి,) వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే వారు రద్దు చేశారన్న వార్త ఉభయగోదావరి జిల్లాలో ఆదివారం దావానలంలా వ్యాపించింది. స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రైళ్ళు కొనసాగించడానికి గతంలో రైల్వే అధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. వారి హామీతో ఈ రైళ్ళు ఇక నిరాగాటంగా నడుస్తాయని…

Read More

కొత్త జిల్లాలతో మారిన ఏపీ ముఖచిత్రం.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ శాఖ , కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురంతో కలిపి 28 జిల్లాలను మ్యాప్ సూచించింది. ఈ పటంలో అమరావతి రాజధానిగా స్పష్టంగా పేర్కొన్నది. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిని పటంలో చూపాలంటే భారతదేశం నుంచి కాశ్మీర్ ను తొలగించినంత ఇబ్బంది పడేవారు. కొన్ని సందర్భాలలో అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణంగా సూచించేవారు కాదు కూడా. పార్లమెంటులో అమరావతి…

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలి. చైర్మన్ నాయుడును బర్తరఫ్ చేయాలి. -తి.తి.దేవస్థానం మాజీ ధర్మకర్త శేషుబాబు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ఆలయ చైర్మన్ బి ఆర్ నాయుడు వెంటనే బర్తరఫ్ చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులతో కలసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More