మత్స్యకారులకు రూ.3 కోట్లతో నైపుణ్య శిక్షణ భవనం శంకుస్థాపన.
యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వెనుకబడిన వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కుందేరు గ్రామంలో మూడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న మత్స్యకార నైపుణ్య శిక్షణ భవనానికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని, పార్టీ ఎప్పటికీ వారికి అండగా నిలుస్తుంది…