Skip to main content

Telugu News Power

పాలకొల్లు రైల్వే స్టేషన్ లో పనిచేయని లిఫ్ట్, 20 రోజులుగా ప్రయాణికులకు ఇక్కట్లు.

పాలకొల్లు: జూన్ ,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాల గురించి పట్టించుకునే నాధుడే లేడని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో, రైల్వే స్టేషన్ లో అసౌకర్యాలు తిష్ట వేశాయని ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా లిఫ్టు పనిచేయకపోవడం వల్ల వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లేవారు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఫ్లాట్ ఫారం మారటానికి ఉన్న ఒకే ఒక్క లిఫ్ట్ తరచూ ఆగిపోతుందని ఆరోపిస్తున్నారు. రోజువారి ఉద్యోగ…

Read More

నమ్మకం సభలు విజయవంతం చేయాలి. -మంత్రి నిమ్మల పిలుపు

పాలకొల్లు: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 18, 19 న రెండు రోజులపాటు జరిగే నమ్మకం సభలను విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కూటమి ముఖ్యనేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 18 న పాలకొల్లు నియోజకవర్గం నమ్మకం సభ నిర్వహిస్తారని తెలిపారు. పూలపల్లి బైపాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం…

Read More

గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆనవాళ్లు ఎక్కడ? -మంత్రి నిమ్మల ఎద్దేవా

యలమంచిలి: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆనవాళ్లు కూడా లేవని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. స్థానిక మేడపాడు లో ఆదివారం రూ. 2.39 కోట్ల పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా,నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్…

Read More

రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రపంచంలో కొనలేనిది రక్తం. కలెక్టర్ కుమారుడి రక్తదానం.

భీమవరం: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆనంద ఫంక్షన్ హాలులో ఆర్.ఆర్. ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదన్నారు. రక్తదానం అంటే ప్రాణదానం. అత్యవసర సమయాల్లో ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదని తెలిపారు. తలసేమియా బాధితులు సహా అనేక మంది రోగులకు…

Read More

చిరంజీవి యువత రక్తదానం.

పాలకొల్లు: జూన్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రక్తదానం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి, కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ అధినేత ఈదుపల్లి శ్రీధర్, చిరంజీవి అభిమాన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, రక్తదానం చేయటం అంటే, ఒకరికి పునర్జన్మ ఇవ్వడంతో సమానం…

Read More

అగ్ని ప్రమాదంలో బూడిదైనా ఈవీఎం యంత్రాలు.

కోల్ కతా: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కోల్‌కతాలోని అలీపూర్ ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఈవీఎంలు బూడిదగా మారాయి. ఈ వార్త దవానంలా, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కోల్‌కతా పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపి మూర్తిని గెలిపించాలి. -యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్

మరోసారి అవకాశం ఇస్తే మీ గొంతునౌతా. -ఎమ్మెల్సీ గోపి మూర్తి భీమవరం; జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజల పక్షాన నిలిచేది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తికి యుటిఎఫ్, ఇతర సంఘాలు మద్దతు…

Read More

దేశ రక్షణలో సేవలు అందించిన సిపాయికి ఎమ్మెల్సీ గోపి మూర్తి సత్కారం.

యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి తన స్వగ్రామం మట్లపాలెంలోని గమల్లపేటలో పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. భారత రక్షణ దినం ఇన్స్పెక్టర్గా 39 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేసిన బుంగరాజు దంపతులను గోపి మూర్తి సత్కరించారు. ఇటీవల ఐఐటీలో సీటు సంపాదించన దీపాటి ప్రదీప్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికోసం సాయం చేస్తున్న గడ్డం సునీల్ గవాస్కర్…

Read More

చించినాడ వంతెన పై ఆకతాయిలకు చెక్ పెట్టిన సీఐ వి. సురేష్ బాబు

మలికిపురం/యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు ఏడాది కాలంగా ఉభయ గోదావరులను కలిపే చించినాడ-దిండి వంతెన ట్రాఫిక్ నియంత్రించిన ప్రాంతాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం సిఐ వి సురేష్ బాబు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు నిత్యం బస్సుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న వివిధ కళాశాలలో చదువు కోసం వస్తుంటారు. వంతెన పై భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. విద్యార్థులను తీసుకువచ్చే బస్సు ఈ సమస్య వల్ల…

Read More

శ్రామికులకు మంత్రి విందు

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న శ్రామికులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తిస్తూ, వారికి చీరలు బహుమతిగా ఇస్తూ, విందు భోజనం ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా, శనివారం స్థానిక చింతపర్రు గ్రామంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించిన దాతలకు, శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన మంత్రి పదవిని…

Read More