Telugu News Power

ఆక్వా రైతుల నష్ట నివారణకు 21 వరకు గడువు. -జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయం.

పాలకొల్లు: మార్చి ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షత వహించారు. దాణ ధరలు తగ్గింపు, రొయ్యల కొనుగోలుపై ధరల పెంపు విషయంలో ఈనెల 21 లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాణా ధరలు కేజీకి నాలుగు రూపాయలు పెంపుతో రైతులను ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధం బూచి చూపి…

Read More

గౌహతికి కొత్త రైలు13న ప్రారంభం.

భీమవరం: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఎంపీ, భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ కేంద్ర సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస కృషితో కొత్త రైలు పట్టాలెక్కనుంది. ఈనెల 13న ఈ రైలు ప్రారంభం కానుంది. చర్లపల్లి (హైదరాబాద్) కామాఖ్య (గౌహతి – అస్సాం) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను ఈశాన్య భారతంతో అనుసంధానిస్తూ, సామాన్య ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తోంది. ఈ నూతన రైలు సర్వీసు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతీయ రైల్వే అత్యంత ఆధునిక…

Read More

నేడు,రేపు కలెక్టర్ల సదస్సు.

అమరావతి; మార్చి,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేడు, రేపు కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతుంది. అధికార యంత్రాంగానికి, రాష్ట్ర అభివృద్ధి కొరకు, ముఖ్యమంత్రి ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తారు. జి ఎస్ డి పి, స్వర్ణాంధ్ర 2047 నిజం లక్ష్యాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, శాంతి…

Read More

తప్పిపోయిన బాలిక.

యలమంచిలి: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మేడపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కనగల సి ఎం ఎస్ బాలల గృహం నుంచి ఇళ్ల కరుణ అనే బాలిక తప్పిపోయింది. ఈమె వయసు 13 ఏళ్లు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ బాలిక కనిపించడం లేదు. ఈ మేరకు ఆమె తల్లి పెద్దింట్లు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గురవయ్య( 9440796672) మంగళ వారం పత్రికలకు ఈ…

Read More

ప్రసిద్ధ చిత్రకారులుదామెర్ల రామారావు జయంతి.

రాజమహేంద్రవరం, మార్చి 9:(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజమండ్రిలోని ప్రసిద్ధ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు 130వ జయంతి వేడుకలలు సోమవారం జరిగాయి. రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మకత కార్పొరేషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా,ఆమె మాట్లాడుతూ, . భారతదేశపు గొప్ప కళాకారులలో ఒకరైన దామెర్ల రామారావుకి నివాళి అర్పించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మృత్యుంజయరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేదికను శ్రీ పొట్టి…

Read More

మంత్రి పదవితో నియోజకవర్గాన్ని అభివృద్ధి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు, (రూరల్), మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కాం) జల వనరుల శాఖ మంత్రిగా నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉల్లంపర్రు వద్ద పాలకొల్లు ప్రధాన పంట కాలువపై నిర్మించనున్న మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన జలవనరుల శాఖ మంత్రిగా తనను నియమించారని నిమ్మల వెల్లడించారు….

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం.

పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ మహిళల సాధికారత, సమానత్వం మరియు సమాజంలో మహిళల కీలక పాత్రపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు కళాశాలలో నిర్వహించే వివిధ రకాల స్కిల్ కోర్సులు దాని ఆవశ్యత గురించి వివరించారు….

Read More

మాజీ మంత్రి కావూరి మృతి.

హైదరాబాద్: మార్చి,9(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు. కావూరు సాంబశివరావు సోమవారం మరణించారు. వయోభారం వల్ల ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ అక్కడే మరణించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కావూరి సాంబశివరావు (82) మరణ వార్త, వారి అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది….

Read More

సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడాలి. -ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పిలుపు.

పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడితేనే, వారికి సార్ధకత చేకూరుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎంఎంకె ఉన్నత పాఠశాల,దాసరి నారాయణరావు కళావేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి అధ్యక్షత వహించారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలు పని ప్రదేశం నుంచి మొదలుకొని ప్రతి చోట వారికి వేధింపులు…

Read More

మహిళలు మరింత ప్రగతి సాధించాలి.

పాలకొల్లు: మార్చి,7 (తెలుగు న్యూస్ పవర్.కాం) మహిళలు అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించి ముందుకు రావాలని, స్థానిక ఛాంబర్స్ కళాశాల అధ్యక్షులు కెవిఆర్ నరసింహారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్థానిక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, ఏపీ ఎన్జీవో అధ్యక్షులు గుడాల హరిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షులు యు వి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని విధాలుగా…

Read More