Telugu News Power

బూరుగుపల్లి లో ఘోరం, వృద్ధుడ్ని కారుతో ఢీ కొట్టిన వైనం.

యలమంచిలి: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బూరుగుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్రంగా రక్షణ ఏర్పడింది. చౌక దుకాణం మాజీ డీలర్ కృష్ణ కుమారుడు బోణం గణేష్ బయటనుంచి కొందరు వ్యక్తులను బయట నుంచి తీసుకువచ్చి జాతరలో బీభత్సం సృష్టించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ హఠాత్పరిణామానికి జాతరలో పాల్గొని జనం చెల్లాచెదురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సొసైటీ మాజీ…

Read More

ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగుల అర్జీలు స్వీకరించిన కలెక్టర్.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 15 అర్జీలు స్వీకరించి నట్టు తెలిపారు. ఆరోగ్యం, పెన్షన్, ఉపాధి, బ్యాంకు రుణాలు వంటి సమస్యలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించాలని,…

Read More

సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు. -నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్.

నరసాపురం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ నెల 13న నరసాపురం మండలం, సీతారాంపురం సౌత్ గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జరిగిన ర్యాలీని ఉద్దేశించి, కొందరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్‌లో అభ్యంతరకరమైన పోస్టులు మరియు వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఉన్న ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ, మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద చట్టం-2015 మరియు ఐటి చట్టం-2000 లోని సంబంధిత సెక్షన్ల కింద…

Read More

జై భీమ్ యువసేన రూ. 48 వేలు సాయం.

యలమంచిలి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నార్ని మెరక శివారు గమళ్ళపెంటకు చెందిన జై భీమ్ యువసేన ఫౌండేషన్, యలమంచిలి లంకకు చెందిన చెవ్వేటి ప్రణీతకు రూ. 48 వేల రూపాయల సహాయం గురువారం అందజేశారు. ఈమెకు తల్లి లేదు. తండ్రి దివ్యాంగుడు. ప్రణీత ప్రస్తుతం బిఎస్సి నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. విషయం తెలుసుకు జై భీమ్ యువసేన ఫౌండేషన్ వారు ఫీజుల నిమిత్తమై అవసరమైన పూర్తి మొత్తం ఫౌండేషన్ ద్వారా అందజేశారు….

Read More

కూటమి ప్రభుత్వం బీసీలకు మద్దతు.

నర్సాపురం: ఏప్రిల్ ,16(తెలుగు న్యూస్ పవర్. కం) బీసీల కోసం ఎవరు ఉద్యమాలు చేసిన వారధిస్తామని నర్సాపురం శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకర్ మాట్లాడుతూ, బీసీ నాయకులు స్వప్రయోజనాల కోసం, ఎవరు ప్రేరేపిస్తే చేసే ఉద్యమాలకు బీసీలు ఎవరు మద్దతు తెలపరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ బీసీల పక్షపాతిగా ఉన్నట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ బీసీలకు…

Read More

మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు.

హైదరాబాద్: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాంచరణ్, నీహారిక వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ, అనుదీప్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ కలిసి ఫిర్యాదు చేసినట్టు అఖిలభారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, తెలంగాణ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ గురువారం…

Read More

రేషన్ కార్డు సమస్యల పరిష్కారం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) చాలా కాలంగా, రాష్ట్రం లో రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ కార్డు దారులకు 9 సేవలు సులభంగా అందుకోవడానికి మార్గం సుగమం చేసింది. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు చేర్పు, సభ్యుల తొలగింపు, కార్డులు కుటుంబాల ద్వారా విభజించడం, చిరునామా వివరాల మార్పు, కార్డు పోగొట్టుకున్న వారికి మరో కార్డు ఇవ్వడం, ఆధార్ తో లింక్ చేయటం, సెల్ ఫోన్ నెంబర్…

Read More

కొత్త పెళ్లి కొడుక్కి కత్తిపోట్లు

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పట్టణం, వలందర్ రేవు సమీపంలో ఉన్న దేవాలయం ఓ ప్రేమ జంట ఆదివారం వివాహం చేసుకున్నారు. కొత్త దంపతులు పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీ దుర్గ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన వధూవరులు, మంగళవారం రాత్రి రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. అందరిలాగే, గోగులమండ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వేదిక వద్దకు…

Read More

స్వదేశీ క్వాంటం కంప్యూటర్లతో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు

అమరావతి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు: అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు ప్రారంభం. భారత రాష్ట్రాల్లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు ఆధారితంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, అకాడమీక్ వర్గాలు, విద్యార్థులతో కలిసి అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ మరియు మేధా టవర్స్‌లో ‘అమరావతి 1క్యూ’గా ఈ ఓపెన్-అక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పడ్డాయి….

Read More

అంబేద్కర్ జయంతి ఉత్సవం లో మేక శేషుబాబు, నల్లి రాజేష్.

పాలకొల్లు: ఏప్రిల్, 14,(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బుద్దావానిపేట అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్, ముఖ్య అతిథులుగా హాజరై, అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు గుండె మహేష్ బాబు, పాలపర్తి కృపానాథ్, సుధా, శేఖర్, బోసు, మాణిక్యం, జయరాజ్, చంద్రశేఖర్, వరప్రసాద్, జగదీష్, సతీష్…

Read More