ఫీడ్ రేట్ల పెంపు పై రొయ్యల రైతుల ఫైర్ ఈ నెల 16 నుంచి ఉద్యమ కార్యాచరణ అవసరమైతే చలో అమరావతికి పిలుపు.
పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అకస్మాత్తుగా, ఎవరి అనుమతులు లేకుండా, రాత్రికి రాత్రే, దొడ్డిదారిలో అడ్డంగా పెంచిన ఫీడ్ ధరలపై ఆక్వా రైతులు ఫైర్ అయ్యారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో చందపర్రు త్రిబుల్ ఎస్ కళ్యాణమండపం లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వీడు ధరలు పెంచవద్దని తాము ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా, పెడచెవిన పెట్టి ఒక్కసారిగా కిలోకు 10 నుంచి…