Telugu News Power

జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించిన ప్రముఖ నటి లక్ష్మి.

భీమవరం: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ రంగస్థలం నటి, ముమ్మారు నంది అవార్డు గ్రహీత బొండాడ (భీమవరం) లక్ష్మి (61) తన జీవిత రంగస్థలం నుంచి ఆదివారం రాత్రి తన పాత్ర ముగించి, రంగస్థలం నుంచి కూడా నిష్క్రమించారు. ఈమె భర్త టైలరింగ్ చేస్తారు. కుమారుడు మధు డాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తారు. భీమవరానికి చెందిన లక్ష్మీ నాలుగున్నర దశాబ్దాల రంగస్థల చరిత్రలో బహుముఖ పాత్రలు పోషించి, నాటక సామ్రాజ్నిగా వెలుగొందారు. ఆమె నాటిక, నాటకం,…

Read More

క్షీరారామంలో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధులలో శ్రీ స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు పూర్తిచేసి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్న భక్తుల సుమారు 250 మంది పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు,ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు, పాల్గొన్నారు.తద నంతరం…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.1.10 లక్షల బంగారు కానుక.

భీమవరం: ఏప్రిల్,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భీమాల శ్రీరామమూర్తి సమీప బంధువు నిమ్మల దినేష్ లక్ష పదివేలు రూపాయలు విలువగల 8 గ్రాముల బంగారాన్ని స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతులమీదుగా శ్రీ అమ్మవారికి…

Read More

డీజిల్ పెట్రోల్ కొరత లేదు. -జె సి రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో రోజుకు మూడు లక్షల లీటర్ల డీజిల్ ఆయిల్ అవసరం కాగా, రోజు 4.5 లక్షల లీటర్ల సరఫరా అవుతుందని ఆదివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందువల్ల డీజిల్ కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వ్యవసాయ మధ్య పరిశ్రమకు సంబంధించి ప్రాధాన్యత రంగాలకు తగిన విధంగా డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు విఆర్ఓ ద్వారా కూపన్లు…

Read More

జోన్లు ఏర్పాటులో ఉద్యోగుల తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. -ఉద్యోగ సంఘ నేత శ్రీకాంతరాజు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తగా ఏర్పాటు చేసే జోనల్ విధానాల్లో ఉద్యోగుల ను భాగస్వాములను చేయటానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీకాంతరాజు డిమాండ్ చేశారు. స్థానిక పింఛనుదారుల సంఘ భవనంలో ఆదివారం జరిగిన మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ, డి.ఏ.బకాయల విడుదల, పి ఆర్ సి కమిటీ…

Read More

చర్లపల్లి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

నర్సాపురం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ నుంచి నరసాపురం – చర్లపల్లి (17061 / 17062) ఆదివారాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం రాత్రి 8 గంటలకు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ , నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. నరసాపురం–హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే…

Read More

నేటి నుంచి ఉచిత వేసవి సైన్స్ తరగతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల యాక్ట్ (ఏ.సి.టి) సైన్స్ సెంటర్ లో వేసవి శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ తరగతులు ఉదయం గం. 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఈ తరగతుల్లో, శాస్త్రీయ భావనలు, శాస్త్ర ప్రయోగాలు, సైన్స్ మ్యాజిక్, వేద గణితం, చిత్రలేఖనం, హస్త కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఈ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు….

Read More

ఉద్యానవన పంటలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం.

అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం కోరారు. పంటలు 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు…

Read More

నరసాపురం ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.

నరసాపురం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి రోగుల నమోదు ఆరా తీశారు. అప్పటివరకు 20 కేసులే వచ్చాయి. ఓపి ఇంత తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. హాజరు పట్టికలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరును పేరుపేరునా పరిశీలించారు. అనంతరం పురుషుల వార్డు, స్త్రీల వార్డు, అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, పిల్లల విభాగం,…

Read More

స్వాతంత్ర్య సమరయోధులు, విద్యాదాత డి. ఎన్. ఆర్. విగ్రహావిష్కరణ!

భీమవరం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, మహనీయులు, “సంకల్ప జీవి” దంతులూరి నారాయణ రాజు గారి విగ్రహాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ, ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖమాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఆవిష్కరించారు.విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి, 1945లోనే భీమవరంలో కళాశాలను స్థాపించి, సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప కృషీవలుడు నారాయణ రాజు సేవలను మంత్రి కొనియాడారు. దేశభక్తుడు, విద్యాదాత వంటి గొప్ప మహనీయుని విగ్రహాన్ని…

Read More