Telugu News Power

ప్రధాని మోడీ మాట, బంగారు భవితకు బాట. -రాష్ట్ర బిజెపి మీడియా కన్వీనర్ కపర్ది.

పాలకొల్లు: మే 22, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుమేరకు, అందరూ పొదుపు చర్యలు పాటించాలని, బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్, ఏఎంసీ మాజీ చైర్మన్, ఉన్నమట్ల కపర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, ప్రధాని మోడీ సూచించిన అంశాలు అనివార్యంగా ఆచరించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న భయానక యుద్ధ పరిస్థితులు సృష్టించే సమస్యలకు ముందుగానే సిద్ధం కావటానికి ప్రధాని…

Read More

రైలులో ప్రయాణిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా, పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం రైలు బండిలో ప్రయాణించారు. వాహన రహిత రోజు (నో వెహికల్ డే) పురస్కరించుకొని, క్యాబినెట్లో ముఖ్యమైన స్థానంలో ఉండి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా అయినా మంత్రి నిమ్మల ప్రోటోకాల్ పక్కనపెట్టి, రైలు పెట్టెలో సామాన్లతో కలిసి ప్రయాణం ప్రారంభించారు….

Read More

రొయ్యల రైతుల ఆగ్రహం రోడ్డు పాలైన కష్టార్జితం. క్రాప్ హాలిడే హెచ్చరిక.

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పేపర్. కామ్) రొయ్యల రైతులు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పూలపల్లి వై జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలో రైతులు పండించిన రొయ్యలు రోడ్డుపై పారబోసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల నడ్డి విరుస్తున్న సిండికేట్ల భాగోతంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా, విజ్ఞప్తి చేస్తూ, నాణ్యమైన సీడ్ అందించే ఏర్పాటు చేయాలని కోరారు….

Read More

నేడు, రేపు రైల్వే గేట్ మూసివేత.

పాలకొల్లు: మే, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు-భీమవరం రోడ్డులో ఉన్న రైల్వే గేట్ ఈనెల 21, 22 న రెండు రోజులపాటు రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నిమిత్తం మూసివేస్తారని రైల్వే శాఖ తెలిపింది. ఇందువల్ల భీమవరం-పాలకొల్లు మధ్య ప్రయాణించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లవలసిందిగా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వే గేటు శుక్రవారం ఉదయం 7 గంటలకు మూసివేసి, శనివారం రాత్రి 7 గంటలకు తెరుస్తారని రైల్వేశాఖ వివరించింది.

Read More

నాటి విధ్వంస పాలన, నేటి అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలు బేరిజు వేసుకోవాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆనాడు ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసపాలన ప్రారంభమైందని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. మండలంలోని వరిధనం, దిగమర్రు, పెదమామిడిపల్లి, కొత్తపేట, పాలకొల్లు రూరల్ లో రూ. 1.90 కోట్లతో ప్రారంభించబోయే అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవపరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వరిధనంలో ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ఎక్కిన కొమ్మనే నరుక్కున్నట్టు, కలెక్టర్ల మీటింగ్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి స్వర్ణ ప్రాజెక్ట్ కు కమిటీ ఏర్పాటు.

భీమవరం: మే,20(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయనిధికి కమిటీ ఏర్పాటు చేశారు. నీ మ్యారేజ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో 12 మంది సభ్యులు,3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ కమిటీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ మయ నిధికి 27 కిలోల బంగారం సహకరించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇప్పటికే 51కేజీల బంగారం వివిధ ఆభరణాల రూపంలో ఉంది. స్వర్ణమయ నిధికి 23 కేజీల బంగారం భక్తులు…

Read More

పట్టణంలో మందుల షాపుల బంధు విజయవంతం.

పాలకొల్లు: మే, 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సంప్రదాయ మెడికల్ షాపుల ఉనికిని దెబ్బతీస్తున్న ఆన్లైన్ ఔషధ విక్రయాల పట్ల దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ కార్యక్రమం బుధవారం పాలకొల్లులో విజయవంతం అయ్యింది. మందుల షాపుల యజమానులు, ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కార్పొరేట్ రంగం అనైతిక వ్యాపార చర్యలతో మందుల షాపులపై ఆధారపడి జీవిస్తున్న వారి పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ డిస్కౌంట్ ల ద్వారా సాంప్రదాయ ఔషధ…

Read More

చించినాడలో ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: మే,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోనే తొలిసారి వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు బుధవారం చించినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ విడత ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు 109 (8,9,10 తరగతుల) మందికి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు. శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ వారి సి ఎస్ ఆర్…

Read More

పట్టణ మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో వైసిపి నిరసన.

పాలకొల్లు: మే,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో మంచినీటి సరఫరా ఇబ్బందులపై వైసీపీ నాయకులు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వంటి పూట సరఫరా చేస్తున్న మంచినీరు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇందువల్ల మహిళలు నానా అవసాట్లు పడవలసి వస్తుందని, కమిషనర్ పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు. మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నేలపై కూర్చుని తమ నిరసన…

Read More

కూటమి ప్రభుత్వంలో 27 వేల కిలోమీటర్ల రహదారులకు మోక్షం. -ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

పాలకొల్లు: మే 19, (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 27 వేల కిలోమీటర్ల రోడ్లు వేసినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్థానిక నియోజకవర్గ పరిధిలో రూ.12.90 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు అనిత శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జనార్ధన రెడ్డి, మాట్లాడుతూ, జిల్లాకు రోడ్ల అభివృద్ధి…

Read More