Skip to main content

Telugu News Power

మాడవీధులలో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కాల్) స్థానిక పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మాడవీధులలో సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో భక్తులు సుమారుగా 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ అర్చకులు వీరబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ స్వామివార్లకు ధూప సేవ, శ్రీ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో సోమవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. హోమ కార్యక్రమములో 89 మంది దంపతులు పాల్గొన్నారు.ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వుదీశి మీనాక్షి, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతిన రమణ, యండ సత్యవతి, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్…

Read More

జనసేన ప్రస్థానం – దేశసమైక్యత కోసం.

ఢిల్లీ సమావేశంలో అయిదు తీర్మానాలకు ఆమోదం. న్యూఢిల్లీ, జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశం అయిదు తీర్మానాలను ఆమోదించింది. వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు అనే తీర్మానాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ…

Read More

రొయ్యల ఫీడ్ ధర పెంపుకు వ్యతిరేకంగా రెవెన్యూ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలి.

-రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: జూన్ 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో ఆక్వా రైతులు రొయ్యల దాణా ధర పెంపుకు నిరసనగా, శాంతియుతంగా వినతి పత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయాల్లో, ఆర్డిఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రైతులు వినతి పత్రాలు అందించాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో రైతులు…

Read More

నమ్మకం సభలు విజయవంతం చేయాలి. -మంత్రి నిమ్మల పిలుపు

పాలకొల్లు: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 18, 19 న రెండు రోజులపాటు జరిగే నమ్మకం సభలను విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కూటమి ముఖ్యనేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 18 న పాలకొల్లు నియోజకవర్గం నమ్మకం సభ నిర్వహిస్తారని తెలిపారు. పూలపల్లి బైపాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం…

Read More

గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆనవాళ్లు ఎక్కడ? -మంత్రి నిమ్మల ఎద్దేవా

యలమంచిలి: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆనవాళ్లు కూడా లేవని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. స్థానిక మేడపాడు లో ఆదివారం రూ. 2.39 కోట్ల పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా,నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్…

Read More

వాస్తవ ఓటర్లను గుర్తించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ.

పాలకొల్లు: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో వాస్తవ ఓటర్లను గుర్తించాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎస్ ఐ ఆర్ పై బిజెపి శ్రేణులకు ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల సవరణ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం…

Read More

రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రపంచంలో కొనలేనిది రక్తం. కలెక్టర్ కుమారుడి రక్తదానం.

భీమవరం: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆనంద ఫంక్షన్ హాలులో ఆర్.ఆర్. ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదన్నారు. రక్తదానం అంటే ప్రాణదానం. అత్యవసర సమయాల్లో ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదని తెలిపారు. తలసేమియా బాధితులు సహా అనేక మంది రోగులకు…

Read More

చిరంజీవి యువత రక్తదానం.

పాలకొల్లు: జూన్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రక్తదానం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి, కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ అధినేత ఈదుపల్లి శ్రీధర్, చిరంజీవి అభిమాన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, రక్తదానం చేయటం అంటే, ఒకరికి పునర్జన్మ ఇవ్వడంతో సమానం…

Read More

అగ్ని ప్రమాదంలో బూడిదైనా ఈవీఎం యంత్రాలు.

కోల్ కతా: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కోల్‌కతాలోని అలీపూర్ ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఈవీఎంలు బూడిదగా మారాయి. ఈ వార్త దవానంలా, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కోల్‌కతా పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ…

Read More