Telugu News Power

రాయకుదురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లు.

వీరవాసరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ ) మండలంలోని రాయకుదురు ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు కాల్కులను శ్రీనివాస్ పత్రికలకు బుధవారం తెలిపారు. కే పల్లవి, ఎస్ సౌజన్య, డి అంజలి, పి వెన్నెల ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, గ్రామస్తులు అభినందించారు.

Read More

మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్.

పోడూరు: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) గ్రామానికి చెందిన పి మాణిక్యం ను పాలకొల్లు ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ స్టేషన్ పరిధిలో నిందితుడు బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నుంచి ఐదు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎస్సైలు జి రఘు, పి మహేష్ వారి సిబ్బంది నిర్వహించిన దాడుల్లో నిందితుడు పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.

Read More

ఋషికొండను సందర్శించిన క్యాబినెట్ సబ్ కమిటీ.

విశాఖపట్నం : జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. గతంలో ఏపీటీడీసీకి ఏటా రూ.7.5 కోట్ల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్‌ను కూల్చివేయడం వల్ల పర్యాటక శాఖ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తిని కూల్చివేయకుండా, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ ) విధానంలో అంతర్జాతీయ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర ప్రారంభం.

భీమవరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ )పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్టమాస జాతర మహోత్సవాలు ప్రారంభ సూచకంగా శ్రీ అమ్మవారిని బుధవారం నిల బెట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శ్రీ అమ్మవారి ఘటాలకు. విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం అనుసరించి శ్రీ అమ్మవారి పుట్టింటి,…

Read More

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తా. -జిల్లా నూతన అధ్యక్షులు తటవర్తి

పాలకొల్లు: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా తటవర్తి కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం వారు ఈ మేరకు నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. గతంలో వీరు పాలకొల్లు శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సంఘానికి ఎనలేని సేవలు అందించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు….

Read More

ముఖ్యమంత్రి బంధు ప్రీతి పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరిన రొయ్యల రైతుల పంచాయితీ.

తాడేపల్లి: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్)రొయ్యల దాణ ధరల పెంపు, రొయ్యల ధరలు తగ్గింపు వంటి దుర్మార్గపు చర్యలకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందు వర్గానికి చెందిన ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కారణమని నరసాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఆక్వా రైతుల బృందానికి ప్రసాద్ రాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా…

Read More

ఆక్వా రైతుల ఆక్రందన, వినతిపత్రాలల్లో తాసిల్దార్లకు విన్నపం.

పాలకొల్లు: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫీడ్ ధరల పెంపు పై ఆగ్రహించిన ఆక్వా రైతులు తమ ఉద్యమ ప్రారంభ ఘట్టంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని తహసిల్దార్ కార్యాలయాలతో వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రొయ్యలు రైతులు వెంటనే ఫీడ్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు…

Read More

ఎయిమ్స్ – మంగళగిరి సందర్శన – సమీక్ష:

ప్రతిష్టాత్మక భారత ఎయిమ్స్ – మంగళగిరి ఆసుపత్రి సమగ్ర పరిశీలన. నాడు దేశంలో చివరి స్థానం, నేడు ఎనిమిదో స్థానానికి ఎగబాకిన ఎయిమ్స్ సేవలు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ఏయిమ్స్ ప్రశంసనీయ సేవలు. మంగళగిరి: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రధాని నరేంద్రమోడీ 12 ఏళ్ల పాలనలో ప్రజోపయోగ,అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అభివృద్ధి జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంగళవారం మంగళగిరి అఖిలభారత వైద్య సంస్థ, ఎయిమ్స్…

Read More

పాలకొల్లు రైల్వే స్టేషన్ లో పనిచేయని లిఫ్ట్, 20 రోజులుగా ప్రయాణికులకు ఇక్కట్లు.

పాలకొల్లు: జూన్ ,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాల గురించి పట్టించుకునే నాధుడే లేడని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో, రైల్వే స్టేషన్ లో అసౌకర్యాలు తిష్ట వేశాయని ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా లిఫ్టు పనిచేయకపోవడం వల్ల వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లేవారు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఫ్లాట్ ఫారం మారటానికి ఉన్న ఒకే ఒక్క లిఫ్ట్ తరచూ ఆగిపోతుందని ఆరోపిస్తున్నారు. రోజువారి ఉద్యోగ…

Read More

దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలం ఏర్పాటు.

పోడూరు: జూన్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం నిరాదరణకు గురై, నిరుపయోగంగా మారింది. దాతల సహకారంతో మళ్లీ పూర్వ వైభవం వచ్చి విద్యార్థులకు ఆటస్థలం ఏర్పాటైన సంఘటన స్థానిక వేడంగి గ్రామంలో జరిగింది. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) పాఠశాల ఆటస్థలం మొక్కలు పెరుగుట వలన ఆటస్థలం నిరుపయోగంగా మూలన పడింది. గ్రామ పెద్దలు బొలిశెట్టి మంగయ్య నాయుడు, బొలిశెట్టి నాగ రమేష్ ఈ సమస్య పరిష్కారం కోసం పూనుకున్నారు….

Read More