ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు అవగాహనా తరగతులు.
పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక కెవిఎమ్ ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులలోని బెరుకును పోగొట్టేందుకు, వ్యక్తిత్వ వికాసం, అభ్యసనా నైపుణ్యాలను పెంపొందింపజేసేందుకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, నర్సాపురం వై ఎన్ కళాశాల కామర్స్ ,మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి హెచ్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొనే క్రమంలో ఏకాగ్రత అవసరమని, కష్టంతో కాకుండా, ఇష్టంగా చదువుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రుల పట్ల, అధ్యాపకుల పట్ల ఎటువంటి భావాలను కలిగి…