పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ఆయువు: మంత్రి కందుల దుర్గేష్
అమరావతి:మే,3(తెలుగు న్యూస్ పేపర్. కాం.) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా, మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్ట్ ఒక సామాజిక యోధుడని, పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు వంటిది అని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభం వంటిదని, సమాజంలోని వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర…