Skip to main content

Telugu News Power

పర్యావరణ పరిరక్షణ అవగాహన సైకిల్ ర్యాలీ. సైకిల్ తొక్కిన కలెక్టర్, ఎమ్మెల్యే.

పెనుమంట్ర: జూన్, 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో పర్యావరణ పరిరక్షణపై సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, ర్యాలీలో సైకిల్ సవారి చేశారు.వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు…

Read More

2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు. జనరల్ డెస్క్,: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా2.5…

Read More

ఉపాధి శ్రామికులకు పక్షానికోసారి వేతనాలు ఇవ్వాలి.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి శ్రామికులకు పనిచేసిన 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జ్ డిమాండ్ చేశారు. స్థానిక లంకలకోడేరు లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలల వరకు ఉపాధి శ్రామికులకు వేతనాలు అందటం లేదని ఆరోపించారు. ఫోటోల కోసం మండుటెండలో శ్రామికులను…

Read More

ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ ప్రారంభం.

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య, ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమయ్యింది. స్థానిక లంకలకోడేరు ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమం ఈనెల 9 వరకు జరుగుతుంది. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, చంద్రశేఖర్ మాట్లాడుతూ, విచారణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఈ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తరగతి గదిలో ఆటపాటలతో విద్యార్థులకు బోధన జరపాలని ఉపాధ్యాయులను కోరారు….

Read More

పోలీసుల వేటలో పట్టుబడ్డ దొంగ, రూ. 19 లక్షల సొత్తు స్వాధీనం.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చోరీ కి గురైన సుమారు రూ. 19 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న ట్టు నర్సాపురం డిఎస్పి ఎం సుధాకర్ రావు వెల్లడించారు. స్థానిక రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి చోరీకి సంబంధించి వివరాలు తెలియజేశారు. నర్సాపురం, రుస్తుంబాదకు చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి నరేష్, రాజమహేంద్రవరానికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన గోడి సతీష్…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం. 21 మంది సజీవ దహనం. మరో 10 మంది పరిస్థితి విషమం.

న్యూఢిల్లీ: జూన్,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బుధవారం ఉదయం 9 గంటలకు హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీ మాల్వియా నగర్ లోని హౌస్ రాణీ యొక్క ఇరుకైన సందులో ఉన్న ఫ్లవర్స్ స్టే హోటల్లో ఎక్కిన ప్రమాదం జరిగింది. స్థానికులు చెప్పుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ హోటల్లో 40 మంది వరకు అతిధులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో వచ్చి కోపంలో వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో…

Read More

సీఎం రాకపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో సీఎం సభ నిర్వహించనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గ్రామ సభ,…

Read More

భీమవరంలో నూతన మల్టీపర్పస్ రెడ్ క్రాస్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారత రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన బహుళ ప్రయోజనకర రెడ్ క్రాస్ నూతన భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం రాయలం గ్రామంలోని బ్లడ్ బ్యాంక్ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలికంగా సేవలు…

Read More

బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ పై విచారణ.

అమలాపురం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లాకలెక్టర్ ఆదేశాలతో, అమలాపురం, ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం విచారణ జరిపారు. బాలిక గర్భవిఛ్ఛిత్తి కేసుకు సంబంధించి డాక్టర్ లంకె శిరీషను అధికారుల బృందం ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన బాలిక అబార్షన్ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో, కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక విచారణ చేపట్టారు.విచారణ బృందంలో కొత్తపేట ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు,…

Read More

వివాహిత కుమార్తెలకూ కారుణ్య నియామక హక్కు.. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:జూన్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల సమాన హక్కులకు బలమైన ఊతమిచ్చే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం చేసుకున్న కుమార్తెను కేవలం ఆమె వైవాహిక స్థితి ఆధారంగా కుటుంబ సభ్యురాలిగా పరిగణించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కుటుంబంలోని ఆధారపడిన సభ్యురాలైతే, ఇతర అర్హతలు నెరవేర్చినట్లయితే వివాహిత కుమార్తె కూడా కారుణ్య నియామకం లేదా కారుణ్య ప్రాతిపదికన లభించే ప్రయోజనాలకు అర్హురాలేనని తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం…

Read More