పర్యావరణ పరిరక్షణ అవగాహన సైకిల్ ర్యాలీ. సైకిల్ తొక్కిన కలెక్టర్, ఎమ్మెల్యే.
పెనుమంట్ర: జూన్, 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో పర్యావరణ పరిరక్షణపై సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, ర్యాలీలో సైకిల్ సవారి చేశారు.వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు…