Skip to main content

Telugu News Power

ఓటర్ల జాబితా తణిఖీలో పార్టీ శ్రేణులది కీలక పాత్ర. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు; జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఓటర్ల జాబితా తణీఖీలో పార్టీ శ్రేణులది కీలక పాత్రని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోడూరు, యలమంచిలి క్లస్టర్ ల పరిధిలో మంత్రి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి, వచ్చే నెల 14 వరకు ఓటర్ల జాబితా తనిఖీ కార్యక్రమం అధికారులు చేపడతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం,…

Read More

చవాకుల చారిటబుల్ ట్రస్ట్ కు అవార్డు.

పాలకొల్లు: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పర్యావరణ దినోత్సవం సందర్భంగా, హైదరాబాదులోని తెలుగు వర్సిటీ, ఎన్టీఆర్ ఆడిటోరియంలోని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ అత్యంత అవశ్యమని, ప్రకృతిని కాపాడుకునే పరిస్థితి ఆసన్నమైందని , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో యోగ శిక్షణ.

భీమవరం: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానము వద్ద ఈనెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవము నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ శనివారం తెలిపారు. ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆదేశముల మేరకు యోగ శిక్షణ తరగతులు ఈనెల 8 నుంచి 21 వరకు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు కాసు బంగారం కానుక.

భీమవరం: జూన్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్).పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ముప్పిరిశెట్టి నాగరాజు, జయశ్రీ దంపతులు కుమారుడు రోహన్ జన్మ దినోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారికి 8 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున…

Read More

కూటమి నాయకుల ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం.

పాలకొల్లు: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పన్నెండు ఏళ్ల ప్రధాన మోడీ పాలనపై నమ్మకం, అభివృద్ధి, పేదల సంక్షేమం సేవలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు జర్నలిస్టు కాలనీలోని పోలింగ్ బూత్- 98 లో ఉన్న శ్రీ విజయ డయాగ్నస్టిక్ కేంద్రం అధినేత శ్రీ కొమ్ముల మురళి సహకారంతో శ్రీ ఏవీఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో, అమ్మ పేరుతో మొక్క…

Read More

విశాఖలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్ ప్రారంభం.

సీఫుడ్ ఎగుమతులను లక్ష కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం విశాఖపట్నం: జూన్ 5: భారత సముద్ర ఆహార (సీఫుడ్) ఎగుమతులను మరింత బలోపేతం చేసి ప్రపంచ మార్కెట్లో దేశ స్థాయిని పెంచేందుకు విశాఖపట్నంలో శుక్రవారం జాతీయ స్థాయి సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ రెండు…

Read More

పర్యావరణ పరిరక్షణ అవగాహన సైకిల్ ర్యాలీ. సైకిల్ తొక్కిన కలెక్టర్, ఎమ్మెల్యే.

పెనుమంట్ర: జూన్, 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో పర్యావరణ పరిరక్షణపై సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, ర్యాలీలో సైకిల్ సవారి చేశారు.వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు…

Read More

2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు. జనరల్ డెస్క్,: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా2.5…

Read More

ఉపాధి శ్రామికులకు పక్షానికోసారి వేతనాలు ఇవ్వాలి.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి శ్రామికులకు పనిచేసిన 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జ్ డిమాండ్ చేశారు. స్థానిక లంకలకోడేరు లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలల వరకు ఉపాధి శ్రామికులకు వేతనాలు అందటం లేదని ఆరోపించారు. ఫోటోల కోసం మండుటెండలో శ్రామికులను…

Read More

ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ ప్రారంభం.

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య, ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమయ్యింది. స్థానిక లంకలకోడేరు ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమం ఈనెల 9 వరకు జరుగుతుంది. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, చంద్రశేఖర్ మాట్లాడుతూ, విచారణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఈ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తరగతి గదిలో ఆటపాటలతో విద్యార్థులకు బోధన జరపాలని ఉపాధ్యాయులను కోరారు….

Read More