Skip to main content

Telugu News Power

ప్రముఖ నటులు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ అస్తమయం.

జనరల్ డెస్క్: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్)నాటక రచయిత, సినిమా నటులు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్‌ కర్నాడ్‌ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్‌ కర్నాడ్‌ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్‌ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు…

Read More

నాటకం ప్రజల వద్దకు వెళ్లి, ముందు తరాలకు మానవ విలువలు అందించాలి. -నాటక రచయిత తాళాబత్తుల

పాలకొల్లు: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) మానవ విలువలు ముందు తరాలకు అందించడానికి ప్రజలలోకి వెళ్లాలని నాటక రచయిత, నటుడు, ప్రయోక్త, నంది అవార్డు గ్రహీత, తాళాబత్తుల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక రసధుని సాహిత్య సంస్థ, నెలవారి కార్యక్రమాల్లో భాగంగా, గురువారం, పింఛనుదారుల భవనం, సిరి తోటి రాఘవులు, దండు చిన రామకృష్ణంరాజు సమావేశ మందిరంలో “నాటక రంగం-మానవీయ కోణం” అనే అంశంపై వక్త తాళాబత్తుల వెంకటేశ్వరరావు ప్రధానోపన్యాసం చేశారు. ఈ సభకు, కొట్టి భాస్కరరావు అధ్యక్షత…

Read More

మోడీ, పుష్కరకాల ప్రధానమంత్రిగా, పాలనకు మద్దతుగా పూజలు.

పాలకొల్లు: జూన్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశంలో సర్వతోముఖ అభివృద్ధి వైపు నడిపిస్తున్న ప్రధాని మోడీ పుష్కరకాలం పాలనకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు, పాక వెంకట సత్యనారాయణ బుధవారం క్షీరారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎంపీకి, పూర్ణకుంభంతో ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరా రామ క్షేత్రంలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వరునికి, మహాదేవునికి పూజలు చేశారు. మోడీ సుస్థిర పాలనలో ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు ఉండాలని, ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక…

Read More

శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల ఫిదా.

పాలకొల్లు: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఫిదా అయ్యారు. నెలన్నర పాటు జరిగిన ఉపాధి హామీ పనులకు హాజరై, మండుటెండలో పనిచేసిన శ్రామిక లోకానికి గౌరవ సత్కారం అందజేశారు. వెలవిలి గ్రామంలో బుధవారం ఏర్పాటు అయినా సభలో శ్రామిక జన సందోహంతో మంత్రి ఉత్సాహంగా ముచ్చటించారు. శ్రామికులకు స్వయంగా, కొసరి కొసరి రొయ్యల పలావు వడ్డించారు. ఉపాధి హామీ పనులలో శ్రామికులకు మంత్రి మొబైల్ చలివేంద్రాలు…

Read More

సంగీత దర్శకుడు రఘు కుంచే కు ఎస్పి బాలు అవార్డు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కళా దర్బార్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గుంటూరు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం గుంటూరులో వీటివల జరిగింది. సినీ రంగం నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నటుడు రుఘు కుంచే ఈ ప్రతిష్టాత్మక అవార్డు శ్రీరంగం నుంచి అందుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని, ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి ఎస్పీ శైలజ, ఇతర ప్రముఖులు రఘు కుంచెను ఘనంగా సత్కరించారు. ఈ…

Read More

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రుల పరామర్శ.

విశాఖపట్టణం: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ( కేజీహెచ్) వద్ద కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి మంగళవారం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించడంతోపాటు, ఆ కుటుంబాలకు అన్ని విధాలా కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం…

Read More

ఉక్కు కర్మాగార ప్రమాదం పై కమిటీతో సమావేశం జరిపిన కేంద్ర సహాయ మంత్రి.

విశాఖపట్నం: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన ఉన్నత స్థాయి ముగ్గురు సభ్యుల కమిటీతో మంగళవారం విశాఖపట్నంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నిపుణులు ప్రియరంజన్, బొకారో ఉక్కు ఫ్యాక్టరీ ఇంచార్జ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్,…

Read More

గాంధీ భగవాన్ రాజును అభినందించిన ఛాంబర్స్ కళాశాల బృందం.

పాలకొల్లు: జూన్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా,ఛాంబర్స్ విద్యా సంస్థల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, కార్యదర్శి కె.వి సీతారామరాజు మంగళవారం భగవాన్ రాజు కార్యాలయంలో కలిసి…

Read More

‘మానవత’ నూతన అధ్యక్షునిగా ముత్యాల రామారావు ఏకగ్రీవం.

పాలకొల్లు: జూన్, 8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల మానవత శాఖకు నూతన అధ్యక్షుడిగా(2026-27) ముత్యాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి మండల సర్వసభ్య సమావేశం సోమవారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. పాలకొల్లు మండలశాఖ ఆవిర్భావం నుంచి ముత్యాల రామారావు డైరెక్టర్స్ బోర్డ్ కన్వీనర్ గా వ్యవహరిస్తూ, సేవాకార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు గత 28 ఏళ్లుగా లయన్స్ క్లబ్ లో వివిధ హోదాలలో…

Read More

రాష్ట్ర ఆక్వా సంఘ నూతన కార్యవర్గానికి ఘనసత్కారం

పాలకొల్లు: జూన్,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్,పాలకొల్లు కాస్మో క్లబ్, ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘ కార్యవర్గం, గౌరవ అధ్యక్షులు, కనుమూరి భాస్కర రాజు, (విజయవాడ) అధ్యక్షులు,గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు,…

Read More