Telugu News Power

మండలి ఛైర్మన్ పై జగన్ ఆగ్రహం!?

అమరావతి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్తడు, ఇష్టుడు అయినా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు మధ్య విభేదాలు తలెత్తయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ హోదాలు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలకు తాను అనుకున్న విధంగా అవకాశం కల్పించడం లేదని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. శాసన సభలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వున్నట్లే, శాసన మండలిలో వైకాపాకు ఆధిక్యత వుంది. ఈ అవకాశాన్ని వాడుకొని, కూటమి ప్రభుత్వాన్ని…

Read More

ఎన్ సి ఇ ఆర్ టి పై కన్నెర్ర చేసిన భారత అత్యున్నత న్యాయస్థానం.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) దేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పై కన్నర్రజేసింది. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకువచ్చిన 8వ తరగతి పాఠ్యాంశం అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. ఇందుకు కారణం, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశంపై ఉన్న విషయం ప్రచురించడం గురించి. అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఏమాత్రం వెసులుబాటు లేని సమగ్ర నిషేధం (బ్లాంకెట్ బ్యాన్) విధించింది. అమ్ముడు పోయిన పుస్తకాలతో…

Read More

పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. -ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.

అమరావతి: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) పరిశ్రమలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి మీడియా పాయింట్ వద్ద బుధవారం వంక మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి పట్ల ఆ సంస్థ మాజీ చైర్మన్ వంక రవీంద్రనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ నుంచి కేవలం 20 శాతం మాత్రమే ఎంఎస్ ఎం లకు ప్రోత్సాహకాలు అందాయని వెల్లడించారు….

Read More

మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

యలమంచిలి:ఫిబ్రవరి,25 (తెలుగు న్యూస్ పవర్) కలెక్టర్ చదలవాడ నాగరాణి, బుధవారం మధ్యాహ్నం, స్థానిక మండలం రెవెన్యూ కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేలపై అత్యవసర సమావేశం నిర్వహించారు.ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాసవి పెనుగొండ, పోడూరు, యలమంచిలి తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, సమగ్ర కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పి-4 పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం 70 శాతం పూర్తయిన సర్వేను…

Read More

ఉపాధి హామీ, 37 కరువు మండలాలకు, 50 రోజుల పొడిగింపు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి నన్ను సార్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ లోని 37 కరువు మండలాలకు 50 రోజులపాటు ఉపాధి హామీ పథకం పొడిగించినట్టు బుధవారం తెలిపారు. శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు ప్రకాశం జిల్లాల కరువు ప్రభావిత 37 మండలాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి ఆమోదించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో అత్యంత సమయోచిత…

Read More

‘మళ్ళిన’ మృతికి ఘన నివాళి.

తణుకు: ఫిబ్రవరి, 25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త మళ్లీన రామచంద్రరావు, బుధవారం మృతి చెందారు. వీరు పారిశ్రామిక కుటుంబీకుల రెండవ తరానికి చెందిన వారు. స్వచ్ఛంద సంస్థ రోటరీ ప్రముఖులు. సాహిత్య రంగానికి మహారాజ పోషకులు. వీరి మృతికి, ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్మే ఆరమిల్లి రాధాకృష్ణ తదితర ప్రముఖులు నివాళులర్పించారు.

Read More

ఏ.ఎస్.ఎన్.ఎం కళాశాలలో, దివిస్ ఉద్యోగ ఎంపికలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో ఈనెల 26న ఉద్యోగాల ఎంపిక జరగనుంది. ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ, దివిస్ లేబరేటరీ లిమిటెడ్ వారు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మంగళవారం తెలిపారు. అభ్యర్థులు,2022 నుండి 2025 వరకు ఆయా డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు, 2026లో చదువుతున్న అభ్యర్థులు కూడ అర్హులు. బిఎస్సీ,(కెమిస్ట్రీ), బి ఫార్మసీ,బీటెక్,(మెకానికల్, కెమికల్,ఇన్స్ట్రుమెంటేషన్) ఎమ్మెస్సీ, (ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ), ఎం…

Read More

శాసనసభను ప్రత్యక్షంగా ,వీక్షించిన ఏ.ఏస్.ఎన్.ఏం విద్యార్థులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా,స్థానిక, ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల విద్యార్థులు మంగళవారం వీక్షించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఆదేశాల మేరకు, కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సభ జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రజాస్వామ్య లో శాసన వ్యవస్థ పనితీరు, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశ పెట్టడం గురించి అవగాహన చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం, వివిధ అంశాలపై చర్చించడం, దానిపై నిర్ణయం…

Read More

భీమవరం ఆదిత్యాలో ఉద్యోగ మేళ.

భీమవరం: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఈనెల 27న నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్, గంగానమ్మ ఆలయం సమీపంలో, బ్యాంక్ కాలనీ, దిరుసుమర్రు రోడ్ లో జరుగుతుంది. ఈ ఉద్యోగం మేళాలో 21 పైగా ప్రముఖ కంపెనీలు 2000 పైగా ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. అభ్యర్థులు, పదవ తరగతి,…

Read More

సొంతగూటికి శేషుబాబు, ఇదివరకే నాగబాబు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నియోజకవర్గ రాజకీయ దిగ్గజం మేక శేషుబాబు తన పెద్ద కుమారుడు సందీప్ వివాహానికి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్వానించారు. గత కొంత కాలంగా శేషుబాబు వైయస్సార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, అత్యంత విశ్వాస…

Read More