Telugu News Power

Blog

పదో తరగతి ఫలితాల్లో ఎలమంచిలి మండల ప్రగతి.

యలమంచిలి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల ఉన్నత పాఠశాలల పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మండలంలోని పాఠశాలల వారీగా అత్యధిక మార్కులు,10వ తరగతి ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి: వైవి లంక పాఠశాల 96% పాసు శాతంతో మొదటి స్థానంలో నిలిచింది, కొంతేరు 67%తో చివరి స్థానాని చేరింది. మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఈ ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More

పదో తరగతి ఫలితాల్లో జేయశ్రీ జయకేతనం.

యలమంచిలి: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) మట్లపాలెం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న అంబటి జయశ్రీ యుటిఎఫ్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించింది. ఆనాడే ఆమె ప్రతిభ కనబరిచింది. ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను592 మార్కులు సాధించింది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంది. తెలుగులో 99, ఆంగ్లంలో 98, హిందీలో 95 మార్కులు వచ్చాయి….

Read More

భూ సేకరణలో రూ. 1,140 కోట్ల భారీ స్కాం. ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్.

అమరావతి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశించాలని విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు సమర్పించింది. గత ప్రభుత్వాలలో జగనన్న కాలనీలు నిర్మించడానికి భూసేకరణ జరిగింది. భూ సేకరణ ధర అర్జెంటు రేటు కంటే ఎక్కువ చెల్లించడం, ఊరికి దూరంగా, కొన్నిచోట్ల అసలు అవసరం లేకుండా భూసేకరణ జరిగినట్టు గుర్తించారు….

Read More

ప్రిన్సిపల్ ‘తిరు వీధుల’కు ఘనంగా వీడ్కోలు.

పాలకొల్లు: ఏప్రిల్,30(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో, గురువారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి పదవీ విరమణ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థుల సంఘటితమై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు. అధ్యక్ష ప్రసంగంలో వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ రాజరాజేశ్వరి నాయకత్వంలో కళాశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ఆమె క్రమశిక్షణ, కృషి,…

Read More

డిగ్రీ 1వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల ప్రభంజనం.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన 1వ సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 80శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిదంన్నారు. విద్యార్థులు 9.2 నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 46మంది. కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక…

Read More

కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటిక పోటీలు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన, ప్రతిష్టాత్మకమైన కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటికోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నాటక పరిషత్తుల నిర్వహణ మోయలేని భారమై, అనివార్యంగా మూసి వేయవలసిన పరిస్థితుల్లో కూడా కొంతేరు నాటక పరిషత్ నిర్విఘ్నంగా కొనసాగటం తో కళా రంగంలో కొంతేరు తన కీర్తి పతాకను ఎగురవేసింది. ఇక్కడ కళాభిమానులు, కళాకారులకు పంచభక్ష పరమాన్నాలు వడ్డించకపోయిన, తమకున్న దానిలో ప్రేమాభిమానాలు పంచుతూ, అతిధి మర్యాదలు చేయటం, ఇక్కడ…

Read More

మానవ కంకాళాన్ని సాక్ష్యంగా బ్యాంకు కు తెచ్చిన గిరిజనుడు. మానవత్వమా ఎక్కడ నీచిరునామా?

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్. కామ్) చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదివాం, విక్రమార్కుడు శవాన్ని తన భుజంపై మోస్తూ వెళుతూ ఉంటే, బేతాళుడు చెప్పిన కథలో ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఆ శవం మళ్ళీ చెట్టు మీదకు వెళ్ళిపోతుంది. సమాధానం చెప్పలేకపోతే విక్రమార్కుని తల వెయ్యి ముక్కలవుతుంది. ఇది ఆనాటి జానపద కథ. నేటి విక్రమార్కుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి, తన భుజాలపై అది శవమా, మానవ కంకాళమా అన్నట్టుగా…

Read More

సిరిమాను ఉత్సవాల్లో కేంద్రమంత్రి.

శ్రీకాకుళం: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి, ధర్మపురం గ్రామాలలో జరిగిన ఆసిరితల్లి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలుపదేళ్లకు ఒకసారి అరసవల్లిలో, 85 ఏళ్ల తరువాత పొందూరు మండలం ధర్మపురం గ్రామాలలో జరిగాయి. ఈ ఆసిరితల్లి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. నేటి సమాజానికి నాటి నాగరికతను గుర్తు చేసే అమ్మవారి చల్లదనం, సిరిమాను ఉత్సవాలు జరుపుకోవడం ఒక బాధ్యతగా, గౌరవంగా భక్తులు భావిస్తారు. ఈ వేడుకల్లో విశేషంగా భక్తులు,…

Read More

ఎగ్జిట్ పోల్స్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బుధవారం ముగిసాయి. ఈ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు తమఅంచనాలు ఋధవారం ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఇది కేవలం అంచనాలు మాత్రమే.

Read More

దొడ్డిపట్ల రేవు పాట ఖరారు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) దొడ్డిపట్ల-కనకాయలంక రేవు పాట బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో జెడివి ప్రసాద్ నిర్వహించారు. ఈ వేలం లో పాల్గొన్న చేగొండి వీర వెంకటరమణ అత్యధిక ధర చెల్లించడానికి టెండర్ వేశారు. ఈ వేలం ప్రకారం 11 నెలలకు గాను, రూ. 3.82 లక్షలు మండల పరిషత్ కు ఆదాయం వస్తుంది. గత నెళ్ళాలుగా ఈ ఫెర్రీ పాట వాయిదా…

Read More